అంకురాలను ప్రోత్సహించేలా కొత్త పాలసీ
2029 నాటికి రూ.50 వేల కోట్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం
డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి కామత్

అంకుర సంస్థలు అభివృద్ధి చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి కామత్
ఈనాడు, హైదరాబాద్: రక్షణ రంగంలో అంకుర సంస్థలను మరింత భాగస్వాములను చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నూతన పాలసీని తీసుకురాబోతోంది. ఏఐ, డ్రోన్స్, శాటిలైట్, సైబర్ సెక్యూరిటీ, హైపర్సోనిక్ లాంటి డీప్ టెక్నాలజీతో అంకుర సంస్థలు పనిచేసేలా కొత్త స్టార్టప్ విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుందని డీఆర్డీవో ఛైర్మన్ సమీర్ వి కామత్ ప్రకటించారు.
విదేశాలకు మన ఉత్పత్తులు
ఆపరేషన్ సిందూర్ తర్వాత డీఆర్డీవో వ్యూహాలకు పదును పెట్టింది. వేర్వేరు ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో భాగంగా డ్రోన్ల ప్రాధాన్యాన్ని గుర్తించింది. ప్రత్యేకించి మధ్యస్థ ఎత్తు-దీర్ఘ సమయం, అధిక ఎత్తు-దీర్ఘ సమయం పనిచేసే డ్రోన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. సంబంధిత మినియేచర్ ఆయుధాలను రూపకల్పన చేస్తోంది. ఇందులో ప్రైవేటు సంస్థలనూ భాగస్వాములను చేస్తోంది. ప్రస్తుతం దేశంలో వార్షికంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు తయారవుతున్నాయి. 2029 నాటికి వాటిని రూ.3 లక్షల కోట్లకు పెంచాలనేది లక్ష్యం. ప్రస్తుతం రూ.23,500 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతుల్ని 2029 నాటికి రూ.50,000 కోట్లను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచితేనే అది సాధ్యమవుతుందని డీఆర్డీవో విశ్వసిస్తోంది. ఇందుకు గతంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ (టీవోటీ) విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా పరిశ్రమలతో 2,100కుపైగా లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది.
స్టార్టప్లకు లాభదాయకంగా...
డ్రోన్ సాంకేతికతలో ప్రైవేటురంగం చాలా పరిణతి సాధించిందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రోన్లకు ఆయుధాలను అమర్చడం, జీపీఎస్ రహిత, ఎలక్ట్రానిక్ యుద్ధ రీతులకు తగ్గట్టుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, అంకుర సంస్థలతో కలిసి పని చేయడానికి డీఆర్డీవో సిద్ధపడుతోంది. అంకుర సంస్థల కోసం డీఆర్డీవో గతంలోనూ పలు పథకాలు తీసుకొచ్చింది. ఇండియన్ డిజైన్డ్ డెవలప్డ్ అండ్ మాన్యుఫ్యాక్చర్డ్ పథకం, డీఆర్డీవో ఇండస్ట్రీ అకడమిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఓపెన్ టెస్ట్ ఫెసిలిటీస్, అంకుర సంస్థలకు శిక్షణ వంటివి అందులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఇక ఊరూరా బ్యాంకింగ్ సేవలు
ప్రతి పల్లెకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితు(ఎస్ఎల్బీసీ)లకు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్!
బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. - 
                                    
                                        

10 నెలల చిన్నారి ఇంటిని తీసుకొచ్చింది
పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధి గణేశ్నగర్లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులో నిర్మించిన ఇంటిని రూ.500కే ఈ చిన్నారి సొంతం చేసుకుంది. - 
                                    
                                        

ఔషధాల వివరాలన్నీ క్యూఆర్ కోడ్లో...
రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేస్తుండగా... ఏటా పెద్దమొత్తంలో మందులు గడువు తీరి వృథా అవుతున్నాయి. - 
                                    
                                        

జూబ్లీ‘త్రి’ల్స్
జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. - 
                                    
                                        

100 మంది ఓటర్లకో నేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. - 
                                    
                                        

పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. - 
                                    
                                        

చదువులో వెనకబాటుకు పిల్లల్ని నిందించలేం
చదువులో కొంత వెనకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని... చదువు రాదని... ఒక ముద్ర వేసి... వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు... అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యా విభాగం మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనితా రాంపాల్. - 
                                    
                                        

ఆయిల్పాం దిగుమతి శాతంలో తెలంగాణ హవా!
ఈ ఏడాది భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నా ఆయిల్పాం మాత్రం బలంగా నిలిచింది. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఓఈఆర్ (నూనె దిగుమతి శాతం) నమోదుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తోంది. - 
                                    
                                        

అభివృద్ధికి దూరం.. గుర్తింపు కోసం ఆరాటం
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయల జీవనం దుర్భరంగా తయారైంది. - 
                                    
                                        

సైబర్ నేరాల నియంత్రణకు కవచం
రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు సరికొత్త కవచం అందుబాటులోకి రాబోతోంది. - 
                                    
                                        

మైస్ టూరిజం 2.0
విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మైస్ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. - 
                                    
                                        

కేసుల పరిష్కారానికే మధ్యవర్తిత్వం
కోర్టుల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు మీడియేషన్- ఆర్బిట్రేషన్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. - 
                                    
                                        

ప్రిన్సిపల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
ప్రిన్సిపల్ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను విధుల నుంచి తొలగించాలంటూ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. - 
                                    
                                        

గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. - 
                                    
                                        

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు డిసెంబరు 9లోపు నెరవేర్చాలి: శ్రీపాల్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా... మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను డిసెంబరు 9లోపు అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. - 
                                    
                                        

సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే
నిపుణుల సూచనల మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆమోదం మేరకు ‘హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 
                                    
                                        

నీరు లేక.. పరిశోధనలు సాగక
దోమల నియంత్రణపై పరిశోధనలు కొనసాగించే హైదరాబాద్ బేగంపేటలోని సుప్రసిద్ధ సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీకి ఏళ్లుగా నీటి సమస్య తీరడం లేదు. - 
                                    
                                        

భూగర్భ జలాలు గలగల..
కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి అక్టోబరు వరకు రాష్ట్ర సాధారణ వర్షం 831 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1,164 మి.మీ. కురిసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కప్పు గెలిచినా.. మిమ్మల్ని ఎప్పటికీ మరవం..
 - 
                        
                            

దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం భేటీ
 - 
                        
                            

నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
 - 
                        
                            

ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
 - 
                        
                            

‘మా కూతురు.. చెక్క బ్యాట్, వస్ర్తంతో చేసిన బంతితో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది’
 - 
                        
                            

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్రెడ్డి
 


