మావోయిస్టులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెడ్డం లక్ష్మణ్‌

నాంపల్లి, న్యూస్‌టుడే: జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని లొంగిపోతున్న మావోయిస్టు నేతలను ప్రభుత్వాలు నమ్మించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని పౌర హక్కుల సంఘం(సీఎల్‌సీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గెడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు మావోయిస్టు నేత కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ను 14 ఏళ్లుగా విచారణ ఖైదీగా జైలుపాలు చేయడమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. మంగళవారం హైదర్‌గూడలోని న్యూస్‌సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎల్‌సీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్‌.నారాయణరావు, హైదరాబాద్‌ జిల్లా బాధ్యుడు బాలకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుపర్చాలని కోరుతూ భువనేశ్వర్‌లోని జర్పాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆజాద్‌ ఆరోగ్యం క్షీణించడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లితే అక్కడి ప్రభుత్వమే బాధ్యతవహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 31లోగా స్పెషల్‌ కోర్టును ఏర్పాటుచేసి విచారణ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు