పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సీసీఐకి మంత్రి కోమటిరెడ్డి వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సీఎండీ లలిత్‌కుమార్‌ గుప్తాకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ముంబయిలో సీసీఐ సీఎండీకి.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి మంత్రి వినతిపత్రం సమర్పించారు. ‘పత్తి తేమ శాతాన్ని 14 వరకు సడలించాలి. మద్దతు ధరను పెంచాలి. కొనుగోలు కేంద్రాలు పెంచి ప్రైవేటు వ్యాపారుల దోపిడీని అరికట్టాలి. తెగుళ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలి. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి’ అని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు