ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సీఈవోకు భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నియమావళిని ఖాతరు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం హామీలు గుమ్మరించి సినిమావాళ్లు, అమాయకుల ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఈవోకు వివరించామని వారు పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ యాదవ్‌ ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు