PG Medical Counselling: వైద్య విద్య పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

Eenadu icon
By Telangana News Desk Updated : 29 Oct 2025 06:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) మంగళవారం పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల చేసింది. అఖిల భారత కోటా 50% సీట్లతోపాటు రాష్ట్ర కోటా కింద ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర కోటా భర్తీకి కాళోజీ వర్సిటీ సైతం సిద్ధమైంది. మొదటి రౌండు, రెండో రౌండు, మాప్‌ అప్, స్ట్రే వేకెన్సీల ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది. మంగళవారం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబరు 5 వరకు కొనసాగనుంది. సీట్ల కేటాయింపు ఫలితాలు నవంబరు 8న వెల్లడించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 9 నుంచి 14 మధ్య వారికి కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జనవరిలోపు స్ట్రే వేకెన్సీ సీట్లను భర్తీ చేసేలా ఎంసీసీ షెడ్యూలు ఖరారు చేసింది. జనవరి చివరి నాటికి అఖిల భారత, రాష్ట్ర కోటాల భర్తీ పూర్తికానుంది.

ముగిసిన ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ రౌండు

కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ రౌండు కౌన్సెలింగ్‌ ప్రక్రియను కాళోజీ వర్సిటీ పూర్తి చేసింది. ఈ మేరకు సీట్లు పొందిన అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. రెండో రౌండు కౌన్సెలింగ్‌ తర్వాత రాష్ట్రంలోని అన్ని యూజీ కళాశాలల్లో 200కు పైగా సీట్లు అందుబాటులో ఉండగా వాటి భర్తీ కోసం మాప్‌ అప్‌ రౌండ్‌ నిర్వహించారు. ఇంకా సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ ద్వారా పూర్తి చేయనున్నారు.

Tags :
Published : 29 Oct 2025 04:17 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు