Self care: అందమొక్కటే కాదు.. అంతరంగం కూడా!
నిజమైన సెల్ఫ్కేర్ అదే...

అందాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు...
ఆత్మీయ బంధాలను రెట్టింపు చేసుకోవడం...
ఫిట్నెస్కు సమయం కేటాయించడమే కాదు...
మానసిక వికాసానికి పెద్దపీట వేయడం...
ఖరీదైన వస్తువులను వాడడమే కాదు...
ఆనందకరమైన అనుభూతులను సొంతం చేసుకోవడం...
సాధారణంగా స్వీయ సంరక్షణ (సెల్ఫ్ కేర్) అనే పదాన్ని వెల్నెస్ బ్లాగుల్లో ఎక్కువగా వింటుంటాం. లగ్జరీ స్పాలు, బబుల్ బాత్లు వంటివి మాత్రమే సెల్ఫ్ కేర్గా పచారం చేస్తున్నారు. అయితే శారీరక, మానసిక వికాసాన్ని ప్రోది చేసుకోవడమే నిజమైన స్వీయ సంరక్షణ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికోసం కొన్నిటిని కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న చర్యలను మన రోజువారీ షెడ్యూల్లో చేర్చుకోవడం ద్వారా ఎనలేని మేలు జరుగుతుందంటున్నారు.
2024లో ‘మైండ్ ఇండియా’ సంస్థ యువత (18-35 సంవత్సరాలు)లో ‘అసెస్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ అమాంగ్ యంగ్ అడల్ట్స్’ పేరిట అధ్యయనం నిర్వహించింది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ’లో నివేదిక ప్రచురితమైంది. దీని ప్రకారం మన యువతలో స్వీయ సంరక్షణ మధ్యస్థ స్థాయిలో ఉంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేమి, సోషల్ మీడియా ఒత్తిడి అధికంగా ఉంది.
- భారతదేశంలో ప్రత్యేకించి మహిళలు, ఉద్యోగులు తమ కోసం తాము సమయం కేటాయించడాన్ని ‘స్వార్థం’గా చూస్తారేమోనన్న ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఈ సర్వే పేర్కొంది.
 - భావోద్వేగ సమతౌల్యం, మానసిక ప్రశాంతత దిశగా చూడడంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నామని ఈ సర్వే చెబుతోంది. స్వీయ సంరక్షణను ఒకే రకంగా చూడకూడదు. ఇది బహుముఖమైనది. మన జీవితంలోని వివిధ అంశాలను కవర్ చేస్తుంది.
 
మానసిక, శారీరక ఆరోగ్యానికి మధ్య సమతౌల్యాన్ని నిలబెట్టు కోవడమే నిజమైన స్వీయ సంరక్షణ. ఇదొక పూల బొకే లాంటిది. ఇందులో ప్రతి పుష్పం ప్రత్యేకమైనదే. మన శరీరం, మనసు, భావోద్వేగాలు, సామాజిక సంబంధాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి.
52 శాతం పురుషులు ‘వెల్నెస్’ అంటే.. కేవలం జిమ్ లేదా ఫిట్నెస్గా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు.


శరీరం: శారీరక సౌందర్యం కోసమే కాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టిపెట్టాలి. సమతులాహారం, వ్యాయామం, తగినంత నిద్ర వంటివి ఇందులో ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్, తీపి, ఫ్రైడ్ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. 7-8 గంటల నిద్ర మానసిక స్థిరత్వానికి కీలకం. రోజూ నడక లేదా యోగా చేయడం మన శరీరాన్ని బలోపేతం చేస్తాయి. ఒక గ్లాస్ స్మూతీ(పండ్లు, కూరగాయలతో) తాగాలి. లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్(గింజలు, బీన్స్) తినాలి. ఇవి శక్తిని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

భావోద్వేగాలు: మనలోని భావాలను అర్థం చేసుకోవడం, వాటిని వ్యక్తపరచడం చాలా ముఖ్యం. దీనికోసం రోజూ ఓ 5 నిమిషాలు డైరీ రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. స్నేహితులతో గడపాలి. ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. భావోద్వేగపరంగా సమస్థితిని ఇస్తాయి.

మనసు: మన మనసును హాయిగా ఉంచుకోవాలి. దీనికోసం పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం లేదా మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం చాలా ఉపకరిస్తుంది. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటే కౌన్సెలింగ్ లేదా థెరపీని పొందొచ్చు.

సమాజం: తోటి వాళ్లతో సత్సంబంధాలను కొనసాగించాలి. అదే సమయంలో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. నెగెటివ్ ప్రభావాల నుంచి దూరంగా ఉండటం కీలకం. టెక్నాలజీ విరామం తీసుకోండి. రోజులో కనీసం ఒక గంట ఫోన్కు దూరంగా ఉంచండి. వారంలో ఒక రోజు కుటుంబంతో లేదా స్నేహితులతో కాఫీ షాప్లో గడపండి.

ఆధ్యాత్మికత: మన అంతరంగాన్ని అన్వేషించడం చాలా మేలు చేస్తుంది. ప్రార్థన, మెడిటేషన్ లేదా ప్రకృతితో సమయం గడపడం మంచిది. రోజూ కాస్తంత సమయం తీసుకుని మనతో మనం గడపాలి. సూర్యోదయం చూడడం, ఇష్టమైన, నచ్చిన వ్యక్తులు, సంఘటనల గురించి రాసుకోవడం... ఇవన్నీ మనల్ని కొత్తగా ఉంచుతాయి.

‘సెల్ఫ్ కేర్ అంటే కేవలం లగ్జరీ జీవితం గడపడం, అందానికి ప్రాధాన్యమివ్వడం మాత్రమే కాదు. ఇది మనదైన జీవనశైలితో ముడిపడి ఉంది. ఆరోగ్యకరమైన జీవితానికి ఇది అవసరం. ఉదయం ఒక గ్లాస్ నీళ్లు తాగడం, మధ్యాహ్నం 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్, సాయంత్రం నీకు ఇష్టమైన హాబీలో 10 నిమిషాలు గడపడం... ఇలాంటి చిన్న విషయాలే మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. స్వీయ సంరక్షణ అనేది మన జీవితంలో ఒక ఆహ్లాదకరమైన రాగం.. దాన్ని ఆలపిస్తూ దాన్ని ఆస్వాదించాలి’
డాక్టర్ ప్రసాదరావు సీనియర్ మానసిక వైద్య నిపుణులు
ఈనాడు,హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఇక ఊరూరా బ్యాంకింగ్ సేవలు
ప్రతి పల్లెకూ బ్యాంకు సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితు(ఎస్ఎల్బీసీ)లకు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్ రిజర్వేషన్!
బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. - 
                                    
                                        

10 నెలల చిన్నారి ఇంటిని తీసుకొచ్చింది
పది నెలల చిన్నారి హన్సికను లక్కీడ్రా వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధి గణేశ్నగర్లో రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం, అందులో నిర్మించిన ఇంటిని రూ.500కే ఈ చిన్నారి సొంతం చేసుకుంది. - 
                                    
                                        

ఔషధాల వివరాలన్నీ క్యూఆర్ కోడ్లో...
రాష్ట్రంలోని సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేస్తుండగా... ఏటా పెద్దమొత్తంలో మందులు గడువు తీరి వృథా అవుతున్నాయి. - 
                                    
                                        

జూబ్లీ‘త్రి’ల్స్
జూబ్లీహిల్స్... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. - 
                                    
                                        

100 మంది ఓటర్లకో నేత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి వందమంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. - 
                                    
                                        

పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. - 
                                    
                                        

చదువులో వెనకబాటుకు పిల్లల్ని నిందించలేం
చదువులో కొంత వెనకబడగానే ఆ పిల్లలకు ఆసక్తి లేదని... చదువు రాదని... ఒక ముద్ర వేసి... వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు... అలాంటి వారికి మరికొంత సమయం కేటాయిస్తే మిగిలిన వారితో సమానంగా రాణిస్తారని చెబుతున్నారు దిల్లీ విశ్వవిద్యాలయం విద్యా విభాగం మాజీ డీన్, విద్యావేత్త ఆచార్య అనితా రాంపాల్. - 
                                    
                                        

ఆయిల్పాం దిగుమతి శాతంలో తెలంగాణ హవా!
ఈ ఏడాది భారీ వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నా ఆయిల్పాం మాత్రం బలంగా నిలిచింది. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఓఈఆర్ (నూనె దిగుమతి శాతం) నమోదుతో తెలంగాణ రికార్డు సృష్టిస్తోంది. - 
                                    
                                        

అభివృద్ధికి దూరం.. గుర్తింపు కోసం ఆరాటం
ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయల జీవనం దుర్భరంగా తయారైంది. - 
                                    
                                        

సైబర్ నేరాల నియంత్రణకు కవచం
రోజురోజుకీ తీవ్రమవుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు సరికొత్త కవచం అందుబాటులోకి రాబోతోంది. - 
                                    
                                        

మైస్ టూరిజం 2.0
విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా మైస్ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. - 
                                    
                                        

కేసుల పరిష్కారానికే మధ్యవర్తిత్వం
కోర్టుల్లో విపరీతంగా పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు మీడియేషన్- ఆర్బిట్రేషన్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ కె.లక్ష్మణ్ అన్నారు. - 
                                    
                                        

ప్రిన్సిపల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
ప్రిన్సిపల్ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను విధుల నుంచి తొలగించాలంటూ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం ఆందోళనకు దిగారు. - 
                                    
                                        

గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం: మంత్రి జూపల్లి
అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. - 
                                    
                                        

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు డిసెంబరు 9లోపు నెరవేర్చాలి: శ్రీపాల్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న సందర్భంగా... మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను డిసెంబరు 9లోపు అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. - 
                                    
                                        

సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగ్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని... నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే
నిపుణుల సూచనల మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆమోదం మేరకు ‘హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 
                                    
                                        

నీరు లేక.. పరిశోధనలు సాగక
దోమల నియంత్రణపై పరిశోధనలు కొనసాగించే హైదరాబాద్ బేగంపేటలోని సుప్రసిద్ధ సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీకి ఏళ్లుగా నీటి సమస్య తీరడం లేదు. - 
                                    
                                        

భూగర్భ జలాలు గలగల..
కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి అక్టోబరు వరకు రాష్ట్ర సాధారణ వర్షం 831 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1,164 మి.మీ. కురిసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 


