Telangana News: వేతనం కోసం రూ.కోటి విడుదల

వరంగల్‌ జిల్లా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిహిర్‌ పరేఖ్‌కు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. గత మూడేళ్లుగా ఆయనకు వేతనం అందడం లేదు.

Updated : 12 Feb 2022 08:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిహిర్‌ పరేఖ్‌కు వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. గత మూడేళ్లుగా ఆయనకు వేతనం అందడం లేదు. నెలకు రూ.రెండున్నర లక్షల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించిన ప్రభుత్వం.. చేనేత కార్మికుల సహాయం కోసం 2021-22 బడ్జెట్‌లో కేటాయించిన నిధుల నుంచి చెల్లించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని