Telangana News: 15 నుంచి ఒంటిపూట బడులు!

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి.

Updated : 13 Mar 2022 09:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులుంటాయి. కొన్ని ఉపాధ్యాయ సంఘాల వినతి నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఒంటిపూట బడులు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రతిపాదనలు పంపారు. పదో తరగతి పరీక్షలు మే 20వ తేదీ వరకు జరగనున్నందున ఈ విద్యా సంవత్సరానికి అదే చివరి పనిదినం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని