JEE Main: జేఈఈ మెయిన్‌-1 దరఖాస్తుకు మరో అవకాశం

జేఈఈ మెయిన్‌ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరో అవకాశం ఇచ్చింది. తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.

Published : 19 Apr 2022 07:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరో అవకాశం ఇచ్చింది. తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 25న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. రెండో విడత(చివరి) దరఖాస్తుకు సంబంధించి కాలపట్టికను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని