Power Crisis: కరెంటు సంక్షోభం రానే రాదు
దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ముంచుకురాబోతోందని చెప్పడంలో అర్థం లేదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్కు తగ్గట్టు
దేశంలో బొగ్గు కొరత లేదు
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా నిల్వలు
కోల్ ఇండియా వద్ద మరో నాలుగు కోట్ల టన్నులు
అనవసర భయాందోళనలు వద్దు
కేంద్ర బొగ్గు శాఖ వెల్లడి
ఈనాడు, దిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం ముంచుకురాబోతోందని చెప్పడంలో అర్థం లేదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పేర్కొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల డిమాండ్కు తగ్గట్టు నల్లబంగారం అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కర్మాగారాల్లో 72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతాయని తెలిపింది. కోల్ ఇండియా వద్ద 4 కోట్ల టన్నుల మేర నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. వాటిని విద్యుదుత్పత్తి కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని చెప్పింది. కాబట్టి అనవసర భయాందోళనలు వద్దని చెప్తూ బొగ్గుశాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘విద్యుత్ కర్మాగారాలకు రోజువారీగా సుమారు 18.7 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉండగా, 17.5 లక్షల టన్నులు సరఫరా అవుతోంది. ప్లాంట్లకు బొగ్గు సరఫరా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు కరిగిపోతున్నాయన్నది అవాస్తవం. ఈ ఏడాది విదేశీ బొగ్గు అవసరాలను దేశీయ కంపెనీలే విస్తృత స్థాయిలో తీరుస్తున్నాయి. బొగ్గు క్షేత్రాల పరిధిలో భారీ వర్షాలు పడినప్పటికీ కోల్ ఇండియా లిమిటెడ్ విద్యుత్ రంగానికి 25.5 కోట్ల టన్నులు సరఫరా చేసింది. 6నెలల్లో ఇంత భారీమొత్తంలో సరఫరా చేయడం ఇదే తొలిసారి. అన్ని మార్గాలను కలుపుకొని కోల్ ఇండియా ఇప్పటివరకు విద్యుత్ రంగానికి రోజుకు సగటున 14 లక్షల టన్నులు సరఫరా చేసింది. వర్షాలు తగ్గిన తర్వాత 15 లక్షల టన్నులకు పెంచింది. అక్టోబరు చివరినాటికల్లా రోజుకు సగటున సరఫరా చేసే బొగ్గు 16 లక్షల టన్నులకు మించుతుంది. సింగరేణి కాలరీస్ లిమిటెడ్, ఇతర సొంత గనుల నుంచి మరో 3 లక్షల టన్నులు రోజూ సరఫరా అవుతోంది’’ అని ప్రకటనలో తెలిపింది.
అదే నిదర్శనం..
‘‘ఒకవైపు విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తూనే.. అల్యూమినియం, సిమెంటు, ఉక్కు వంటి విద్యుత్తేతర పరిశ్రమలకు కోల్ ఇండియా రోజూ 2.5 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. దేశంలో నల్లబంగారం సరఫరా సంతృప్తికరంగా ఉందనడానికి ఇదే నిదర్శనం’’ అని బొగ్గుశాఖ పేర్కొంది.
ఒక్కరోజులో 19.2 లక్షల టన్నుల సరఫరా
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శనివారం ఒక్కరోజే 19.2 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. ఈ కేంద్రాల్లో రోజువారీ వినియోగానికి 18.7 లక్షల టన్నులే అవసరమని గుర్తుచేసింది. కోల్ ఇండియా, సింగరేణి, సొంత గనులు, దిగుమతులు.. ఇలా అన్నిమార్గాలు కలిపి అవసరాలకు మించి బొగ్గు సరఫరా చేసినట్లు వెల్లడించింది. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని నిల్వలపై విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమీక్ష నిర్వహించినట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు