ప్రధాని వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల వాసి

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేస్తుండగా ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల పట్టణానికి చెందిన గడప రాజేష్‌ నియమితులయ్యారు. ఈ నెల 2 నుంచి 4వరకు ట్రెడ్‌మిల్‌, జిమ్‌ సైకిల్‌ సాధనకు

Updated : 01 Jul 2022 06:30 IST

మంచిర్యాల క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేస్తుండగా ఆయనకు ప్రత్యేక వ్యాయామ శిక్షకుడిగా మంచిర్యాల పట్టణానికి చెందిన గడప రాజేష్‌ నియమితులయ్యారు. ఈ నెల 2 నుంచి 4వరకు ట్రెడ్‌మిల్‌, జిమ్‌ సైకిల్‌ సాధనకు శిక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో అథ్లెటిక్స్‌ కోచ్‌(సాట్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడ్రోజులపాటు దేశ ప్రధాని వ్యాయామ సాధనలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని రాజేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని