జూనియర్ కళాశాలలుగా 86 గురుకుల పాఠశాలలు
రాష్ట్రంలోని 86 సంక్షేమ గురుకుల పాఠశాలల్ని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతీకరణ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్
ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు ప్రభుత్వ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 86 సంక్షేమ గురుకుల పాఠశాలల్ని జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతీకరణ ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల నుంచి జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసిన వాటిలో 75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ గురుకులాలు ఉన్నాయి. శుక్రవారమిక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో సీఎస్ సమావేశమయ్యారు. వెంటనే అప్గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జిల్లాల్లో శాశ్వత స్టడీసర్కిళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. గురుకులాల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ శత్రువుల ఓటమి ఖాయం
‘‘140 కోట్ల మంది భారతీయుల సంకల్పం జూన్ నాలుగో తేదీన నెరవేరబోతోంది. భాజపాను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశ శత్రువులు ఓడిపోవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు