అదే పువ్వు.. మువ్వన్నెలు రువ్వు!
ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది.
ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని కోమనేని రఘు నివాసంలో శనివారం ఈ మందార జాతి పువ్వు వికసించింది. ఈ మొక్కను హైబిస్కస్ ముటాబిలిస్ అని పిలుస్తారు. దీనినే కాన్ఫెడరేట్ రోజ్ మల్లో, డిక్సీ రోజ్ మల్లో, కాటన్ రోజ్ మల్లోగానూ వ్యవహరిస్తారని, మొక్కను నాలుగేళ్లుగా పెంచుతున్నానని రఘు చెప్పారు. తొలిసారి 2021 అక్టోబరులోనూ.. తాజాగా మళ్లీ రెండోసారి శనివారం పూసిందన్నారు. ఏడాదికోసారి పుష్పించే ఈ మొక్కలను చైనా, తైవాన్ దేశాల్లో పెంచుతారని వివరించారు.
- న్యూస్టుడే, శాయంపేట (హనుమకొండ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?