క్రమం తప్పిన స్థలాల క్రమబద్ధీకరణ..!
ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల సర్వేకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని, తమవి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
జీవో58 దరఖాస్తుల సర్వేకే ప్రాధాన్యం
తమవి చేయట్లేదని జీవో 59 దరఖాస్తుదారుల ఆవేదన
ప్రభుత్వం అవకాశమిస్తే.. అధికారులు అడ్డుపడుతున్నారని అసంతృప్తి
ఈనాడు, హైదరాబాద్: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల సర్వేకే అధికారులు ప్రాధాన్యమిచ్చారని, తమవి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. రెండో విడత సర్వేలోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. తమ స్థలాలు క్రమబద్ధీకరణ అవుతాయా.. లేదా అనే సందేహాలు వారిని వేధిస్తున్నాయి. కనీసం ఏ కారణంగా సర్వే చేపట్టడం లేదో చెప్పాలని కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా.. స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండు విడతల్లోనూ..
- క్రమబద్ధీకరణలో భాగంగా జీవో 58 కింద 125 చదరపు గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా, జీవో 59 కింద 125 చదరపు గజాలపైన అధీనంలో ఉన్న వారికి మార్కెట్ ధరకు రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
- 2014 జూన్ 2 వరకు ‘ఆక్రమిత గడువుగా’ పేర్కొంటూ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఒకసారి దరఖాస్తులు స్వీకరించింది.
- ఆక్రమిత గడువును 2020 జూన్ 2 వరకు పొడిగించి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండోసారి దరఖాస్తులు స్వీకరించగా 2 లక్షలకుపైగా వచ్చాయి.
- మొదటి విడత(జీవో 58) దరఖాస్తులపై గతేడాది చివర్లో సర్వే ప్రక్రియ నిర్వహించారు. ఆక్రమిత స్థలంలో నివాసం, ఖాళీ ప్రదేశాన్ని కొలతలు వేసి డిమాండ్ నోటీసులు అందజేశారు.
- ఈ క్రమంలోనే జీవో 59 పరిధిలోని దరఖాస్తులను పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
- ఇదిలా ఉండగానే ఈ ఏడాది ఏప్రిల్లో రెండో విడత దరఖాస్తులు స్వీకరించిన రెవెన్యూ అధికారులు మరోసారి సర్వే ప్రారంభించారు.
- ఇప్పుడు కూడా తమను పట్టించుకోవడం లేదని జీవో 59 దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్లను సంప్రదించొచ్చు
- నవీన్ మిత్తల్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్
గతేడాది దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైనవారి స్థలాలను సర్వే చేశాం. జీవో 59 కింద కూడా దాదాపు అన్ని జిల్లాల్లో జరిగింది. సర్వే జరగని వారుంటే కలెక్టర్లకు విన్నవించవచ్చు. ఆక్రమిత గడువు పొడిగించాక వచ్చిన దరఖాస్తుల పరిశీలన తుది దశకు వచ్చింది. మరో నెల రోజుల్లో క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ పూర్తి చేస్తాం.
భూముల ధరలే కారణమా..?
భూముల ధరలు అధికంగా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. స్థలాల ధర చదరపు గజం రూ.5 వేలకు మించి ఉన్నచోట ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు స్థలం విస్తీర్ణం 200 చదరపు గజాల్లోపు ఉన్న వాటికే అధికారులు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాల అభివృద్ధి, విక్రయ విధానంలో భాగంగా పక్కన పెట్టి ఉండవచ్చనే భావిస్తున్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన డేటా మేరకే సర్వే చేపడతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. చలానా కట్టి దరఖాస్తు చేసిన తమకు ఏ విషయం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటూ దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
జీవన్రెడ్డి మాల్ స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్లో దిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
‘ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. -
తూప్రాన్ ఈఎస్ఐ ఆసుపత్రికి 46 రోజులుగా తాళం
మెదక్ జిల్లా తూప్రాన్లోని ఈఎస్ఐ ఆసుపత్రి 46 రోజులుగా మూతపడి ఉంది. 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఏప్రిల్ 1న ఆసుపత్రికి తాళం వేశారు. -
జూన్ 3న లాసెట్, పీజీఎల్సెట్ పరీక్షలు
తెలంగాణలో లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు, మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి నారాయణరావులు విమర్శించారు. -
మేడిగడ్డపై రేపు సీఎం రేవంత్ సమీక్ష
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్.డి.ఎస్.ఎ.) ఇచ్చిన నివేదికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. -
దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి
దత్తత తీసుకున్న బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని.. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు. -
ఇదీ సంగతి!