సీఎం రేవంత్కు నోటీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు.
రేపు విచారణకు హాజరు కావాలన్న దిల్లీ పోలీసులు
మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు కూడా..
రిజర్వేషన్లపై అమిత్షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, భాజపా ఫిర్యాదు.. కేసు నమోదు
ఈనాడు, హైదరాబాద్: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10.30 గంటలకు దిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఛైర్మన్ మన్నె సతీశ్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌధరీ పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌధరీ అందజేశారు. నోటీసులు అందుకున్నవారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సీఆర్పీసీ 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. దిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. అమిత్షాపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను, పోస్ట్ చేసేందుకు వినియోగించిన ల్యాప్టాప్/మొబైల్/ట్యాబ్లెట్ను, ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు.
ఇదీ నేపథ్యం..
రాష్ట్రంలో ఇటీవల ఓ సభలో అమిత్షా ప్రసంగిస్తూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే ఇచ్చేస్తాం’’ అని చెప్పారు. దీన్ని కొంతమంది వక్రీకరించి.. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని భాజపా పేర్కొంటోంది. ఎన్నికల్లో భాజపా గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచార సభల్లో రేవంత్రెడ్డి సైతం ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తాను అనలేదని అమిత్షా వివరణ ఇచ్చారు. ఆయన వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని దిల్లీ పోలీసులకు భాజపాతో పాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ(ఎంహెచ్వో) అధీనంలోని ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి..
అమిత్ షా వీడియో మూలాల(సోర్స్)ను తెలుసుకునేందుకు ‘ఎక్స్’తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీడియోను ఎవరు వ్యాప్తి చేశారు, మూలం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలుసుకునేందుకు స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండర్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం.. సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాచారం కోరింది. కేసుకు సంబంధించి అస్సాంలో ఒకర్ని అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మరోవైపు, అమిత్షాకు సంబంధించి డీప్ ఫేక్, మార్ఫింగ్ వీడియోను ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెబుతున్నట్టుగా ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. -
తెలంగాణలో 65.67శాతం పోలింగ్ : సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM