20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది.
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో జైలు సిబ్బంది ఆమెను మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ న్యాయవాదులు దర్యాప్తు పురోగతిని న్యాయమూర్తికి వివరించి కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరారు. వారం రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ న్యాయవాది తెలిపారు. కవితకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని 10-15 మంది పోలీసులు తనిఖీచేసి చివరకు పాడుచేసిన ఆహారాన్ని అందిస్తున్నారని ఆమె న్యాయవాది నితేష్ రాణా తెలిపారు. అలా కాకుండా జైలు డాక్టర్ తనిఖీచేసి అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ కోరతామని న్యాయమూర్తి స్పష్టంచేశారు. కవిత కోర్టు హాల్ నుంచి బయటికి వెళ్తూ.. ‘ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి నాలాంటి వారిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నా’ అని అన్నారు.
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టుకు
బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ సోమవారం రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్చేస్తూ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. బుధవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
మద్యం కేసులో మరొకరి అరెస్ట్
దిల్లీ మద్యం కేసులో ఈడీ మరొకరిని అరెస్ట్ చేసింది. గోవాకు చెందిన వినోద్ చౌహాన్ను అదుపులోకి తీసుకొని మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆయన గత గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ నేతలకు హవాలా రూపంలో రూ.25 కోట్లు అందించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. -
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ
తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా ఆదేశించారు. -
ఎన్నికల సమయంలో నగదు జప్తు సబబే
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది అక్టోబరులో మిర్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తున్న వాహనంలో సీజ్ చేసిన రూ.3.04 కోట్ల నగదు విడుదలకు, దాని ఆధారంగా నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరించింది. -
ధాన్యం టెండర్లలో అక్రమాలు.. పెద్ది సుదర్శన్రెడ్డి
గ్లోబల్ టెండర్ల పేరుతో జరిగిన ధాన్యం అమ్మకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని భారాస మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు