Boeing Whistleblower: బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
బోయింగ్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ ఒకరు ఆకస్మికంగా మరణించారు. రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు విజిల్ బ్లోయర్లు మరణించడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు (Boeing) చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్ (45) ఆకస్మికంగా మరణించారు. బోయింగ్ సప్లయర్ అయిన స్పిరిట్ ఏరో సిస్టమ్స్లో గతంలో క్వాలిటీ ఆడిటర్గా వ్యవహించిన డీన్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో రెండు వారాల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎక్మో కూడా అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరించడం వల్ల ఆయన మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో లోపాలు బయటపెట్టిన జాన్ బార్నెట్ ఆత్మహత్యకు పాల్పడిన రెండు నెలలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల తయారీలో లోపాలను స్పిరిట్ సంస్థ పట్టించుకోవడం లేదని డీన్ ఆందోళన వ్యక్తం చేశారు. విమాన లోపాలను బయటకు వెల్లడించారన్న కారణంతో ఆయన్ను గతేడాది ఏప్రిల్లో ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్లైనర్ తయారీలో ప్రమాణాలు పాటించడం లేదంటూ బెర్నాట్ కూడా సంబంధిత సమాచారాన్ని బహిర్గతం చేశారు. లోపాలు బయటపెట్టినందుకు దావా కూడా ఎదుర్కొన్నారు. దాదాపు 32 ఏళ్ల పాటు బోయింగ్లో పని చేసిన ఆయన 2017లో రిటైర్ అయ్యారు. ఈ ఏడాది మార్చి 9న తనంతట తానే గాయపరుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విమానాల్లో లోపాలు బయటపెట్టిన ఇద్దరు ఉద్యోగులపై బోయింగ్ పగబట్టిందంటూ రెండేళ్ల క్రితమే బోయింగ్కు చెందిన యూనియన్ ఆరోపించింది. ఈ క్రమంలో వరుస ఉదంతాలు జరగడం గమనార్హం. మరోవైపు గతంలో బోయింగ్ ఇంజినీర్గా పనిచేసిన మరో ప్రజావేగు సామ్ సలేపూర్ ఇటీవల అమెరికా సెనేట్లో పలు కీలక విషయాలను బయటపెట్టాడు. ఉత్పత్తి అవరోధాలను అధిగమించడానికి బోయింగ్ కంపెనీ షార్ట్కట్ మార్గాన్ని ఎంచుకుంటోందని పేర్కొన్నాడు. దీనివల్ల విమాన ప్రయాణంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. దీనివల్ల కంపెనీ భద్రత, విమాన లైఫ్ సైకిల్ కూడా తగ్గుతుందన్నాడు. బోయింగ్ విమానాలు పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడింది. అంతకుముందు ఇండోనేషియా, ఇథియోపియాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇవే విమానాలు 346 మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా