Australia: చైనా దూకుడును ఖండించిన ఆస్ట్రేలియా..!
దక్షిణ చైనా సముద్రం( South China Sea)లో చైనా(China) దూకుడును ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది.
దిల్లీ: దక్షిణ చైనా సముద్రం( South China Sea)లో చైనా(China) దూకుడును ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. దీనిని వాస్తవాధీన రేఖ(LAC) వద్ద జరిగిన గల్వాన్ ఘర్షణతో పోలుస్తూ.. భయానకంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ వద్ద మీడియాతో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ విధంగా స్పందించారు.
‘చైనా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వైఖరి గత దశాబ్దం నుంచే కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా మనం దూకుడుతో ముందుకెళ్తోన్న చైనాను చూస్తున్నాం. భారతదేశంతో ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భయానక ప్రవర్తనను మనం చూశాం. గల్వాన్ ఘర్షణ విషయంలో మేం భారత ప్రభుత్వానికి సంఘీభావంగా నిలబడతాం. దక్షిణ చైనా సముద్రం(ఎస్సీఎస్) విషయంలో మేం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాం’ అని వెల్లడించారు. ఈ సముద్రంలో కృత్రిమ ద్వీపాల నిర్మాణం జరుగుతోందన్నారు. అది ఎల్ఏసీ అయినా, ఎస్సీఎస్ అయినా.. ఈ ప్రాంతానికి ముఖ్యమైన నిబంధనల ఆధారిత క్రమాన్ని చైనా సవాలు చేస్తోందని విమర్శించారు. ఆ దేశం సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా కాకుండా బలంతో పరిష్కరించుకోవాలని చూస్తోందని, ఈ తీరే ఆందోళన కలిగిస్తోందన్నారు.
భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఈ రెండూ ప్రజాస్వామ్య దేశాలని, తమతమ దేశాల్లో చట్టబద్ధమైన పాలనను అందిస్తున్నాయని చెప్పారు. ‘భారత్తో మాకు భౌగోళిక బంధం ఉంది. ఆస్ట్రేలియా హిందూ మహాసముద్ర (Indian ocean) దేశం. మన రెండింటి మధ్య రక్షణ సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలున్నాయి. ఇండియన్-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని వెల్లడించారు. అలాగే ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇది ఆహార, ఇంధన భద్రతపై పెను ప్రభావాన్ని చూపుతుందన్నారు. అలాగే యుద్ధంపై భారత్ తీసుకున్న వైఖరి, దానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు