అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్: అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. అరెస్టు సమయంలో సాహు తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ నెల 21న ఈ సంఘటన జరిగింది. ఓ మహిళపై దాడి జరిగిందన్న ఫిర్యాదుతో పోలీసులు సాహు ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఓ 51 ఏళ్ల మహిళను సాహు ఉద్దేశపూర్వకంగా వాహనంతో ఢీకొని పారిపోయినట్లు తెలుసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కొన్ని గంటల అనంతరం ఘటనా స్థలానికి నిందితుడు చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సమయంలో తన బీఎండబ్ల్యూ ఎస్యూవీ వాహనంతో సాహు పోలీసులను ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. మరో అధికారి కాల్పులు జరిపారు. దీంతో సంఘటనా స్థలంలోనే ఉత్తర్ప్రదేశ్కు చెందిన సాహు ప్రాణాలు కోల్పోయారు. బైపోలార్ డిజార్డర్తో సాహు బాధపడుతున్నట్లు ఆయన మాజీ భార్య గోల్డ్స్టీన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.