పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
అమెరికాకు డ్రాగన్ స్పష్టీకరణ
రెండు దేశాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం
బీజింగ్: దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం, రెండు దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్ను బలోపేతం చేయడం, ఇరు దేశాల ప్రభుత్వాధినేతల సూచనలకు అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రిని వృద్ధి చేసుకోవడం, అన్ని స్థాయిల్లోనూ ఉన్నతాధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య శుక్రవారం ఇక్కడ భేటీ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు, చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్ను డ్రాగన్ ముంచెత్తడం సహా అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జిన్పింగ్, బ్లింకెన్తో భేటీపై చైనా అధికారిక మీడియా ఓ కథనాన్ని వెలువరించింది.
దీని ప్రకారం.. పోటీకి చైనా భయపడబోదని జిన్పింగ్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు ఇవ్వడం, దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్తో ఉద్రిక్తతలను పెంచుతున్న డ్రాగన్ చర్యలను బ్లింకెన్ ప్రస్తావించారు. అమెరికాతో సహకారానికి తాము సిద్ధమేనని, అయితే అది ఇచ్చిపుచ్చుకునేదిగా ఉండాలని జిన్పింగ్ పేర్కొన్నారు. ‘‘పోటీకి చైనా భయపడదు. అయితే ఆ పోటీ.. ఉమ్మడి పురోగతికి ఉద్దేశించిందై ఉండాలి’’ అని తెలిపారు. అలీనోద్యమానికి చైనా కట్టుబడి ఉందని చెప్పారు. అయితే చిన్నపాటి కూటములను ఏర్పాటు చేయడం వంటివి అమెరికా మానుకోవాలని కోరారు. భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి వంటివాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు వేర్వేరుగా మైత్రీబంధాలు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. పరస్పరం లక్ష్యంగా చేసుకోవడం, వ్యతిరేకించుకోవడం, నష్టం చేసుకోవడం వంటివి చేయకూడదన్నారు.
‘‘రెండు దేశాలు భాగస్వాములుగా ఉండాలి. ప్రత్యర్థులుగా కాదు’’ అని స్పష్టంచేశారు. రష్యాకు చైనా మద్దతు ఇవ్వరాదన్నది అమెరికా, ఐరోపా సంఘం, నాటో దేశాల కోరిక అని బ్లింకెన్ స్పష్టంచేశారు. లేకుంటే అదనపు చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. చైనాకు చెందిన 100కుపైగా సంస్థలపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చైనా సంస్థలు రష్యా ఆయుధ కంపెనీలకు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. చైనా ప్రజల అభివృద్ధి హక్కును ఎవరూ అడ్డుకోజాలరని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ స్పష్టంచేశారు. చైనా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీని లక్ష్యంగా చేసుకొని అమెరికా అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఇది న్యాయబద్ధమైన పోటీ కాదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి. -
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థుల కనీస బ్యాంకు బ్యాలెన్సు మొత్తాన్ని 29,710 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో శృంగార తార స్టార్మీ డేనియల్ వాంగ్మూలం ఇచ్చారు. -
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
బ్రిటన్లో ఓ లెక్కల టీచర్ వ్యవహారాలు సంచలనం సృష్టిస్తున్నాయి.విద్యార్థులతో ఆమె సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు. -
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. -
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
రఫాపైకి దూకుడుగా వెళుతున్న ఇజ్రాయెల్కు అమెరికా గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన బాంబుల సరఫరాను ఆపేసింది. -
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
AstraZeneca: గిరాకీ తగ్గిన నేపథ్యంలో తమ కొవిడ్ వ్యాక్సిన్ను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. -
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM