అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు.
వారం రోజుల్లో 550 మందికి పైగా అరెస్టు
అదుపులో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్
కొనసాగుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు
పారిస్కూ పాకిన ఆందోళనలు
న్యూయార్క్: ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో చర్చలు జరుపుతుంటే, మరి కొన్నిమాత్రం పోలీసులను రంగంలోకి దింపుతున్నాయి. గురువారం ప్రిన్స్టన్ యూనివర్సిటీలో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన అచింత్య ప్రిన్స్టన్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఆందోళనల్లో భాగంగా వర్సిటీ ప్రాంగణంలో టెంట్లు వేయడానికి ప్రయత్నించిన ఆమెను అరెస్టు చేశారు. మరో విద్యార్థి హసన్ సయ్యద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా వీరిద్దరిపై నిషేధం విధించారు.
జార్జివాషింగ్టన్ యూనివర్సిటీలోనూ పాలస్తీనాకు సంఘీభావంగా ప్రదర్శనలు జరిగాయి. ఇందులో విద్యార్థులతో పాటు.. ప్రొఫెసర్లూ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో వారం రోజుల్లో సుమారు 550కిపైగా విద్యార్థులు అరెస్టయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్లో 33 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనెక్టికట్ యూనివర్సిటీలో గుడారాలను పోలీసులు కూల్చివేశారు. ఒహాయో యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ చేసిన హెచ్చరికలను ఖాతరు చేయని వారిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా యూనివర్సిటీల ఆందోళనలు ఫ్రాన్స్నూ తాకాయి..ప్రతిష్ఠాత్మక పారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ విద్యార్థులు పాలస్తీనియన్లకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. క్యాంపస్లోకి ప్రవేశించే మార్గాలను మూసివేశారు. కార్యాలయాలను ఆక్రమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?