DAC: అమెరికన్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చజెండా..!
అమెరికా నుంచి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు రక్షణ శాఖలోని డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం తెలిపింది. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఈ నిర్ణయం వచ్చింది.
దిల్లీ: అమెరికా (America) నుంచి సాయుధ డ్రోన్ల (MQ-9B Predator Drones) కొనుగోలుకు మార్గం సుగమమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన గురువారం సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (DAC) ఈ ఒప్పందానికి పచ్చజెండా ఊపింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనకు భద్రతా కేబినెట్ కమిటీ (CCS) ఆమోదముద్ర వేయాల్సి ఉందని ఓ అధికారి వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటన వేళ డీఏసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 30 డ్రోన్లతో కూడిన ఈ కొనుగోలు ఒప్పందం విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు. త్రివిధ దళాల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు.
సరిహద్దులు, సాగరజలాల్లో నిఘా, శత్రు జలాంతర్గాముల వేట, సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలపై కచ్చితత్వంతో దాడి వంటి అవసరాలకు ఈ డ్రోన్లను ఉపయోగించే వీలుంది. చాలాకాలంగా అమెరికా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. అయితే, కొన్ని ఇబ్బందులతో ఈ ఒప్పందం ముందుకు వెళ్లడంలేదు. ఎట్టకేలకు డీఏసీ దీనికి ఆమోదం తెలిపింది. అమెరికాలో మోదీ- బైడెన్ల చర్చల అనంతరం దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. భారత్ ప్రస్తుతం రెండు అమెరికన్ ‘ఎమ్క్యూ-9బీ సీ గార్డియన్’ డ్రోన్లను లీజుకు తీసుకుని నడిపిస్తోంది. అవి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘానేత్రంగా పనిచేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు