Doctor: రోగి కాలేయాలపై పేర్లు చెక్కిన వైనం.. వైద్యుడిపై జీవితకాల నిషేధం
అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన వృత్తికే తలవంపులు తెచ్చే పని చేశాడు. ఓ రోగికి రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన.......
లండన్: అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. తన వృత్తికే తలవంపులు తెచ్చే పని చేశాడు. ఓ రోగికి రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన యూకేకు చెందిన డాక్టర్ సైమన్ బ్రామ్హాల్ తన పేరులోని మొదటి అక్షరాలతో కాలేయాలపై సంతకంలా చేశాడు. దీనిపై తాజాగా విచారణ జరపగా.. మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రైబ్యునల్ సర్వీస్ (ఎంపీటీఎస్).. నిందితుడి పేరును మెడికల్ రిజిస్టర్ నుంచి తొలగించింది. వైద్య వృత్తి నుంచి అతడిని శాశ్వతంగా తప్పించింది.
2013లో కాలేయ మార్పిడి చేయించుకున్న బాధితుడు.. అనారోగ్యంతో కొద్దిరోజులకే మరోసారి ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం బయటపడింది. అతడి లివర్పై 1.6 అంగుళాల సైజులో అక్షరాలు ఉన్నట్లు మరో వైద్యుడు గుర్తించాడు. సదరు బాధితుడికి మొదట చేసిన కాలేయ మార్పిడిలోనూ సైమన్ ఇలాగే చేసినట్లు అప్పుడే తెలిసింది. 2013 ఫిబ్రవరి, ఆగస్టులో.. ఇలా రెండుసార్లు కాలేయ మార్పిడి చేసిన సమయంలో వాటిపై తన ఇనీషియల్స్ను రాసినట్లు సైమన్ 2017లో తన నేరాన్ని అంగీకరించాడు. అక్షరాలు రాసేందుకు ఆర్గాన్ బీమ్ మెషీన్ను ఉపయోగించినట్లు వివరించాడు.
విషయం బయటకు తెలిసిన అనంతరం.. సైమన్ 2013లోనే కన్సల్టెంట్ సర్జన్ పోస్ట్ నుంచి సస్పెండ్ అయ్యాడు. 2014లో విచారణ సమయంలోనే అతడు తన పదవికి రాజీనామా చేశాడు. కాగా ఈ రెండు కేసుల్లో నిందితుడు మొత్తం 13,619 డాలర్లు (రూ. 10 లక్షలకుపైనే) జరిమానా కట్టాలని, సమాజ సేవ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. 2020 డిసెంబర్లో ఎంపీటీఎస్ మరోసారి కేసును సమీక్షించి.. మెడికల్ ప్రాక్టీస్ చేయకుండా ఐదు నెలలు సస్పెన్షన్ విధించింది. అయితే సత్ప్రవర్తన కారణంగా అతడిపై ఉన్న సస్పెన్షన్ను 2021 జూన్లో ఎత్తివేసింది. కాగా ఆ సస్పెన్షన్పై ట్రైబ్యునల్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు జడ్జి.. నిందితుడిని వైద్య వృత్తి నుంచి తొలగించడమే సముచితమైనదని, అదే అతడికి శిక్ష అని స్పష్టం చేశారు.
సైమన్ ‘ఆటోగ్రాఫ్’ వల్ల రోగికి ఎలాంటి శారీరక నష్టం జరగకపోయినా.. మానసికంగా ఎప్పటికీ వేధిస్తుందని తాజాగా జరిపిన విచారణలో మెడికల్ ట్రైబ్యునల్ కూడా పేర్కొంది. వైద్య వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. అయితే 28 రోజుల్లోగా సైమన్ బ్రామ్హాల్కు దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు