ఇటలీలో పట్టణాన్ని ముంచెత్తిన బురద.. పరుగులు తీసిన జనం

ఇటలీలో ఆకస్మికంగా సంభవించిన వరదలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. స్థానికంగా ఓ పట్టణంలో ఎటు చూసినా బురద మేటలే దర్శనమిచ్చాయి.

Updated : 18 Aug 2023 06:02 IST

రోమ్‌: ఇటలీలో ఆకస్మికంగా సంభవించిన వరదలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. స్థానికంగా ఓ పట్టణంలో ఎటు చూసినా బురద మేటలే దర్శనమిచ్చాయి. భారీ వర్షాల కారణంగా మెర్డోవిన్‌ నది ఉప్పొంగి ప్రవహించింది. దీనికి తోడు సమీప పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. తీరప్రాంత పట్టణమైన బార్డోనెషియాలో ఒక్కసారిగా మెరుపు వరద ప్రవేశించింది. పెద్దఎత్తున బురద ప్రవాహం వీధులను ముంచెత్తింది. అప్రమత్తమైన పౌరులు రోడ్ల వెంబడి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వరదల ధాటికి పట్టణంలో చెట్లు కూలిపోవడంతోపాటు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, కార్యాలయాలు చెత్తాచెదారం, బురదతో నిండిపోయాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక గవర్నర్‌ తెలిపారు. ప్రాణనష్టాన్ని నివారించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు