తొలి చర్చతో మార్మోగిన వివేక్ పేరు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతి వివేక్ రామస్వామి ప్రజాదరణలో అనూహ్యంగా దూసుకుపోతున్నారు.
గంటలో 4.5 లక్షల డాలర్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతి వివేక్ రామస్వామి ప్రజాదరణలో అనూహ్యంగా దూసుకుపోతున్నారు. గురువారం రిపబ్లికన్పార్టీ చర్చ ముగిసిన గంటలోనే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా అమెరికన్లు 4.5లక్షల డాలర్ల విరాళాలు గుప్పించారు. దీన్నిబట్టి ఆయన వాగ్దాటి.. ఎంతగా మంత్రముగ్ధులను చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఆయన ప్రస్తుతం అమెరికా ఒపీనియన్ పోల్స్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ల తర్వాతి స్థానంలో ఉన్నారు. ‘ట్రంప్ గైర్హాజరీలో... రిపబ్లికన్పార్టీ చర్చల్లో రామస్వామి దూసుకుపోతున్నారు’ అని ఆక్సిక్ వార్తాసంస్థ కొనియాడగా... తొలి సమావేశంలో రామస్వామి అందరి దృష్టిని ఆకర్షించారు అని వాల్స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. రామస్వామి వాదనా పటిమముందు ఇతరులంతా తేలిపోయారని న్యూయార్క్టైమ్స్ పేర్కొంది. ఇది రిపబ్లిక్ పార్టీ షోలా కాకుండా వివేక్ రామస్వామి షోలా ఉందని ఎన్బీసీ వార్తాసంస్థ వ్యాఖ్యానించింది. చర్చ అనంతరం జరిగిన సర్వేలో 28 శాతం మంది రామస్వామి ప్రదర్శన అత్యుత్తమం అనగా... 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్కు మద్దతుగా నిలిచారు. మాజీ ఉపాధ్యక్షుడు మైక్పెన్స్కు 13 శాతం మంది, నిక్కీ హేలీకి 7 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అభ్యర్థిత్వ రేసులో చివరకు ట్రంప్, తాను మాత్రమే మిగులుతామని రామస్వామి జోస్యం చెప్పారు. అలాగే చర్చావేదికపై కూడా ట్రంప్ను ఆయన కొనియాడారు. 21వ శతాబ్దంలో ఆయనే అత్యుత్తమ అధ్యక్షుడు అని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు
దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. -
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు కొత్త ఒప్పందం!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. -
డొనాల్డ్ ట్రంప్ దోషే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. -
పశ్చిమాసియాలో వైమానిక గర్జనలు
యుద్ధవిమానాల గర్జనలతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. సెంట్రల్ గాజాలో శుక్రవారం ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. -
అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా బృహత్
అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ - 2024 పోటీల్లో భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ విజేతగా నిలిచాడు. -
రష్యాపైకి అమెరికా తయారీ ఆయుధాలు
ఖర్కివ్ ప్రాంతాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రష్యా భూభాగంలోకి ‘అమెరికా తయారీ ఆయుధాలు’ వినియోగించేందుకు ఉక్రెయిన్ను అనుమతించాలని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. -
అమెరికా కాంగ్రెస్కు భారత సంతతి వైద్యుడి పోటీ
భారత్లోని చెన్నై నగరంలో జన్మించిన అమెరికా వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా కాన్సస్ రాష్ట్రంలోని మూడో నియోజకవర్గం నుంచి అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు పోటీచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
-
పాండ్య ‘బ్యాకప్’ పేసర్.. బౌలింగ్ కాంబినేషన్ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్
-
సల్మాన్పై లారెన్స్ బిష్ణోయ్ ట్రిగర్.. పాక్ నుంచి ఏకే-47 తుపాకులు..!
-
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
-
గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..
-
వైఎస్సార్ జిల్లాలో పోలీసుల తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.1.5 కోట్లు స్వాధీనం