నింగిలోకి జపాన్ లూనార్ ల్యాండర్
జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతమైంది.
ఎక్స్-రే టెలిస్కోప్ కూడా..
విజయవంతంగా తీసుకెళ్లిన హెచ్-2ఏ రాకెట్
వచ్చే ఏడాది చంద్రుడి కక్ష్యలోకి చేరనున్న ‘స్లిమ్’
టోక్యో: జాబిల్లిపై తొలిసారి అడుగుపెట్టాలన్న కలను సాకారం చేసుకునేందుకు జపాన్ కీలక ప్రయోగం చేపట్టింది. పలుమార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతమైంది. నైరుతి జపాన్లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్-రే టెలిస్కోప్(ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపీ మిషన్), లూనార్ ల్యాండర్ను తీసుకొని హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జక్సా ఈ ప్రయోగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత ఎక్స్ఆర్ఐఎస్ఎం (ఎక్స్-రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపి మిషన్) ఉపగ్రహాన్ని హెచ్-2ఏ రాకెట్ భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్ చెబుతోంది.
పిన్ పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ
ఇక ఇదే ప్రయోగంలో జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్ను కూడా పంపించారు. ఈ ల్యాండర్.. మూడు - నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అంటే.. వచ్చే ఏడాది జనవరిలో ఈ స్లిమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. జాబిల్లి, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం ‘పిన్ పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీ’తో స్లిమ్ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. కానీ, నిర్దేశిత ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేట్లు దీనిని డిజైన్ చేశారు.
జాక్సాకు ఇస్రో అభినందన
గురువారం ఉదయం జాక్సా రూపొందించిన ఎక్స్రే టెలిస్కోప్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ (స్లిమ్) మిషన్లు విజయవంతంగా ప్రయోగించటంపై ఇస్రో అభినందించింది. చంద్రుడిపై అధ్యయనానికి మరో అంతరిక్ష సంస్థ ఉపక్రమించినందుకు అభినందనలంటూ ఇస్రో ట్విటర్లో పేర్కొంది. చంద్రునిపై అధ్యయనానికి బయలుదేరిన ‘స్లిమ్’ విజయవంతమైతే ఆ మిషన్తో లబ్ధి పొందే దేశాల్లో భారత్ కూడా ఒకటి. జాక్సా సంస్థ సహకారంతోనే చంద్రయాన్ మిషన్లోని ల్యాండర్, రోవర్లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. చంద్రునిపై తదుపరి అధ్యయనాల కోసం ఇస్రో రూపొందిస్తున్న లూనార్ పోలార్ ఎక్స్ప్లొరేషన్ మిషన్ (లూపెక్స్) జాక్సా సహకారంతోనే సిద్ధమవుతోంది. మొత్తంగా గురువారంతో చంద్రునిపై అధ్యయనానికి ప్రయోగాలు చేపట్టిన దేశాల సంఖ్య జపాన్తో కలిసి 5కు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి