సింగపూర్ ఎంపీల ‘అక్రమ సంబంధం’తో రాజీనామాలు..
అక్రమ సంబంధం వ్యవహారానికి సంబంధించి సింగపూర్ పార్లమెంటు (Singapore Parliament) సభ్యుడు, భారత సంతతి వ్యక్తి లియాన్ పెరేరా (Leon Perera) రాజీనామా చేశారు.
సింగపూర్: సింగపూర్ పార్లమెంటును (Singapore Parliament) అక్రమ సంబంధాల వ్యవహారం కుదిపేస్తోంది. ఇదే విషయమై పార్లమెంట్ స్పీకర్తోపాటు ఓ మహిళా ఎంపీ రాజీనామా చేసిన రెండు రోజులకే మరో వ్యవహారం వెలుగు చూసింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన భారత సంతతి వ్యక్తి లియాన్ పెరేరా (Leon Perera) తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే పార్టీకి చెందిన మహిళా ఎంపీతో అక్రమ సంబంధం ఉందనే విషయం బయటకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత విచారణలో భాగంగా వారి మధ్య ఉన్న సంబంధం వాస్తవమని తేలినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి (Workers' Party) చెందిన లియాన్ పెరేరా (53), నికోల్ సీహ్ (36)లు అక్కడి పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ వివాహితులే. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, వీరిద్దరికి సంబంధించి తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడం చర్చకు దారితీసింది. పెరేరా, నికోల్లు ఇద్దరూ ఓ డైనింగ్ టేబుల్ వద్ద చేతులు పట్టుకొని కూర్చున్న వీడియో ఫేస్బుక్లో చక్కర్లు కొట్టింది.
పుతిన్ను అరెస్టు చేస్తే.. రష్యాపై యుద్ధం ప్రకటించినట్లే: దక్షిణాఫ్రికా
అయితే, ఈ ఇద్దరూ తరచుగా రెస్టారెంట్లు, హోటళ్లలో కలుసుకునేవారని, చేతులు పట్టుకొని, ఆలింగనాలు కూడా చేసుకునేవారని పెరేరా డ్రైవర్ 2021లోనే తమకు ఫిర్యాదు చేశాడని పార్టీ వెల్లడించింది. తాజా వీడియోలోనూ ఇద్దరు సీనియర్ సభ్యులు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు కనిపించిందని తెలిపింది. ‘2020 సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిద్దరూ సంబంధాన్ని కొనసాగించారు. కానీ, కొంతకాలం తర్వాత దానికి ముగింపు పలికారు’ అని వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్ ప్రీతమ్ సింగ్ వెల్లడించారు. తొలుత ఈ విషయాన్ని ఇరువురూ ఖండించినప్పటికీ చివరకు దీన్ని అంగీకరించారని అన్నారు. ఆ మహిళా ఎంపీ కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేసిందన్నారు.
మరోవైపు అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) ఎంపీ చెంగ్ లీ హుయి, పార్లమెంట్ స్పీకర్ టాన్ చువాన్-జిన్ల మధ్య ఈ తరహా సంబంధం ఉందన్న వార్త సంచలనం రేపింది. దీంతో ఆ ఇద్దరూ జులై 17న పార్లమెంటు సభ్యత్వంతోపాటు తమ పార్టీకీ రాజీనామా చేశారు. పీఏపీ పార్టీ ప్రమాణాలకు అనుగుణంగా వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు. వారి అనుచిత ప్రవర్తనను మానుకోవాలని గత ఫిబ్రవరిలోనే హెచ్చరించినప్పటికీ ఆ సంబంధాన్ని కొనసాగించారన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే ప్రతిపక్ష పార్టీల ఎంపీల వ్యవహారం వెలుగు చూడటంతో సింగపూర్ పార్లమెంటులో ఈ అంశం చర్చనీయాంశమయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్