Illegal Immigrants: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశం.. ఏడాదిలో 97 వేల మంది భారతీయుల అరెస్టు
గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు.
వాషింగ్టన్: గత ఏడాది కాలంగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 97 వేల మంది భారతీయులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (UCBP) అధికారులు తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని వెల్లడించింది. తాజా అక్రమ వలసలకు సంబంధించి యూసీబీపీ డేటా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2019-20లో 19,883 మంది, 2020-21లో 30,662 మంది, 2021-22 మధ్య 63,927 మంది అరెస్టు కాగా, 2022 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు 96,917 మంది భారతీయులు అరెస్టయినట్లు యూసీబీపీ తెలిపింది. వీరిలో 30,010 మందిని కెనడా సరిహద్దుల్లో, 41,770 మందిని మెక్సికో బోర్డర్లో అరెస్టు చేసినట్లు తెలిపింది.
అరెస్టయిన వారిని నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపింది. మైనర్లతో కలిసి వచ్చేవారు, కుటుంబంగా వచ్చేవారు, ఒంటరిగా వచ్చే పెద్దలు, ఒంటరిగా వచ్చే పిల్లలు. 2022-23లో 84 వేల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించగా, 730 మంది పిల్లలు ఒంటరిగా వచ్చారని తెలిపింది. వీరంతా ఫ్రాన్స్ నుంచి మెక్సికోకు చేరుకుని అక్కడి నుంచి బస్సులను అద్దెకు తీసుకుని అమెరికా సరిహద్దులకు చేరుకుంటున్నట్లు గుర్తించామని అమెరికా సెనేటర్ జేమ్స్ లాంక్ఫోర్డ్ తెలిపారు.
అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించే వారంతా.. స్వదేశంలో తమకు రక్షణ లేదని చెబుతున్నారని లాంక్పోర్డ్ వెల్లడించారు. దీంతో అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వారికి ఆశ్రయం కల్పించాల్సి వస్తోందన్నారు. ఏటా అమెరికాలోకి 20 లక్షల మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అమెరికాలో వీసా సమస్యలు కూడా అక్రమ వలసలు పెరగడానికి కారణం కావచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా