Biden: ‘హమాస్.. అల్ఖైదా మాదిరిగానే’: జో బైడెన్
ఇజ్రాయెల్కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో హమాస్ దాడులతో పాలస్తీనీయులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
వాషింగ్టన్: ఇజ్రాయెల్ - హమాస్ (Israel Hamas Conflict) మధ్య పోరు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హమాస్ మిలిటెంట్ గ్రూప్.. అల్ఖైదా మాదిరిగానే కన్పిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్కు తాము అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు.
‘‘హమాస్ దాడిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 27 మంది అమెరికన్లు ఉన్నారు. వీళ్లు (హమాస్ గ్రూప్ను ఉద్దేశిస్తూ) చాలా దుర్మార్గులు. అల్ఖైదా ముష్కరుల్లాగే ప్రవర్తిస్తున్నారు. నేను ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఇజ్రాయెల్కు అమెరికా అండగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. హమాస్ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉంది’’ అని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.
యుద్ధ నియమాలు పాటిస్తున్నారా?.. వాటిని అతిక్రమిస్తే నేరమే
హమాస్ దాడులతో పాలస్తీనా పౌరులకు ఎలాంటి సంబంధం లేదన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలని బైడెన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ యుద్ధం ఫలితంగా పాలస్తీనీయులు కూడా తీవ్ర కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక హమాస్ దాడుల అనంతరం కొంతమంది అమెరికా పౌరులకు కన్పించకుండా పోయిన ఘటనపైనా బైడెన్ స్పందించారు. వారీ ఆచూకీ గుర్తించి, క్షేమంగా తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!