Titan: ఆశతో వెళ్లాం.. శకలాలే దొరికాయి..! తీవ్ర భావోద్వేగానికి గురైన రెస్క్యూ టీం లీడర్
టైటానిక్ శిథిలాల సందర్శనకు వెళ్లిన ‘టైటాన్’ మినీ జలాంతర్గామి సముద్ర గర్భంలో విచ్ఛిన్నమయిన విషయం తెలిసిందే. దాని శకలాలను గుర్తించిన ‘పెలాజిక్ రీసెర్చి సర్వీసెస్’ సంస్థ సీఈవో.. రెస్క్యూ మిషన్ను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ (Titanic) శిథిలాల సందర్శనకు వెళ్లిన ‘టైటాన్ (Titan)’ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించిన ‘ఓషన్గేట్’ (OceanGate) సీఈవో సహా ఐదుగురు మృతి చెందారు. టైటానిక్ శిథిలాల సమీపంలోనే టైటాన్ శకలాలు లభ్యమయ్యాయి. రెస్క్యూలో పాల్గొన్న ‘పెలాజిక్ రీసెర్చి సర్వీసెస్’ బృందం వాటిని గుర్తించింది. ఈ క్రమంలోనే ‘రెస్క్యూ మిషన్’ సాగిన తీరును మీడియాకు వివరిస్తూ.. పెలాజిక్ సీఈవో, బృందానికి నాయకత్వం వహించిన ఎడ్ కసానో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. టైటాన్ విషయంలో తాము మొదలుపెట్టిన రెస్క్యూ ఆపరేషన్.. చివరకు శకలాల రికవరీగా ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సముద్ర గర్భంలోకి ప్రయాణం మొదలైన 1.45 గంటల తర్వాత నీటిపై ఉన్న నౌక ‘పోలార్ ప్రిన్స్’తో టైటాన్ సంబంధాలు కోల్పోయింది. రెస్క్యూ విషయంలో మా సంస్థను సంప్రదించగా.. ఆర్వోవీ ‘ఒడిసియస్ 6కే’ను రంగంలోకి దించాం. టైటాన్ను కనుగొన్న వెంటనే వీలైనంత త్వరగా పైకి తీసుకురావడమే మా ప్రణాళిక. కానీ, 90 నిమిషాలకు టైటానిక్ శిథిలాల ప్రదేశానికి చేరుకునేటప్పటికి.. రెస్క్యూపై ఆశలు కోల్పోయాం. సముద్రపు అడుగుకు చేరుకున్న కొద్దిసేపటికే టైటాన్ సబ్మెర్సిబుల్ శకలాలను కనుగొన్నాం. దీంతో మా రెస్క్యూ.. శకలాల రికవరీగా ముగిసింది’ అని దుఃఖాన్ని దిగమింగుతూ జరిగిందంతా వివరించారు. ఈ ఘటనపై తమ బృంద సభ్యులూ తీవ్రంగా కలత చెందుతున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా