Ukraine: కనుచూపు మేరలో వినాశనమే..!
ఉక్రెయిన్పై రష్యా ప్రకటించిన యుద్ధం ఎంత వినాశనం సృష్టించిందో ప్రపంచానికి తెలియజేసే ఫొటోలు విడుదలయ్యాయి. ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ఫొటోలను ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఊహించని వినాశనం చోటు చేసుకొంది. కళ్లముందే మేరియుపోల్ వంటి నగరాలు నేలమట్టమయ్యాయి. తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలోని ఓ పట్టణం ఏ స్థాయిలో ధ్వంసమైందో తెలియజేస్తూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ట్వీట్ చేసింది. డ్రోన్ నుంచి దీనికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. డొనెట్స్క్లోని ‘మరింక’ అనే నగరం దృశ్యాలు కలచివేసివిగా ఉన్నాయి. కనుచూపు మేరలో మొత్తం భూమి కాలిబూడిదైపోయింది.
గతంలో దాదాపు 10,000 మంది నివాసం ఉన్న ఈ నగరంలో ఇప్పుడు ఎవరూ లేరు. ఇళ్లు పూర్తిగా శిథిలమైపోయాయి. ఈ నగరంలో పేలుడు జరగని ప్రాంతమంటూ కనిపించదు. డాన్బాస్ వేర్పాటువాదులు దీనిపై తొలిసారి దాడి చేసి ఆధీనంలోకి తీసుకొన్నారు. కానీ, నాలుగు నెలల తర్వాత ఉక్రెయిన్ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకొంది. ఈ పోరాటాల దెబ్బకు నగరం మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. అక్కడ ఒక్క మనిషి కూడా జీవించడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: అనసూయ బ్లూమింగ్.. తేజస్వి ఛార్మింగ్..
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్రాయిస్పై సీబీఐ కేసు