Time Theft: వర్క్ ఫ్రమ్ హోంలో ఆఫీస్ సమయం వృథా.. మాజీ ఉద్యోగినికి రూ.3లక్షల ఫైన్
వర్క్ఫ్రం హోం సమయంలో ఆఫీస్ సమయాన్ని వృథా చేశారనే కారణంతో ఓ ఉద్యోగినికి రూ.3లక్షల జరిమానా పడింది. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఉద్యోగి పనితీరును విశ్లేషించినట్లు సదరు కంపెనీ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ఇంటి నుంచే పని (Work from Home)కు అనుమతించాయి. దీంతో ఇంటినుంచే స్వేచ్ఛగా పనిచేసుకునే సౌలభ్యం ఉద్యోగులకు లభించింది. అయితే, దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో ఆఫీస్ సమయాన్ని వృథా చేశారని.. అందుకు కంపెనీకి రూ.3లక్షలు చెల్లించాలని ఓ ఉద్యోగినిని ఆదేశించింది. ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఉద్యోగిని పనితీరును విశ్లేషించి ‘సమయం చోరీ’ చేసిన విషయాన్ని గుర్తించినట్లు సదరు కంపెనీ పేర్కొనడం గమనార్హం.
కెనడాకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ.. అక్కడి బ్రిటిష్ కొలంబియాలోని ఓ సంస్థలో అకౌంటెంట్గా పనిచేసేవారు. అయితే, ఆ సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి గతేడాది తొలగించింది. కారణం మాత్రం చెప్పలేదు. దీంతో తనకు పరిహారం చెల్లించాలని ఆ ఉద్యోగిని సంస్థను డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త కోర్టుకు చేరింది.
తన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పర్యవేక్షిస్తారని సదరు మహిళ చేసిన ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. కేవలం ఆఫీస్ డాక్యుమెంట్లను మాత్రమే తమ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది. తమ సాఫ్ట్వేర్ ఎంత కచ్చితంగా పనిచేస్తుందోననే విషయాన్ని కూడా వివరించింది. 50గంటలపాటు ఆమె లాగిన్ అయినట్లు చూపించినప్పటికీ ఆ సమయంలో తనకు అప్పజెప్పిన పని మాత్రం చేయలేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ విశ్లేషణను కోర్టు ముందు ఉంచింది. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఉద్యోగిని తొలగించిన వ్యవహారాన్ని పక్కన బెడితే.. కంపెనీ సమయాన్ని వృథా చేసినందుకు ఆ మాజీ ఉద్యోగినే సంస్థ నుంచి వివిధ రూపాల్లో పొందిన ప్రయోజనాల మొత్తం రూ.3లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.
ఆఫీస్ సమయాల్లో ఉద్యోగి పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని టైమ్క్యాంప్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో సదరు కంపెనీ పర్యవేక్షించేదట. ఆఫీస్ డాక్యుమెంట్లను ఎంత సేపు ఓపెన్ చేసి ఉంచారు, వాటిని ఎలా ఉపయోగించారనే విషయాలను ఈ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో కార్లే బెస్సె ఆఫీస్ టైంలో ఎక్కువగా కంప్యూటర్కు దూరంగా ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు