Nepal: యతి ఎయిర్లైన్స్..ఆయనది ఓ విషాద కథే!
ఆంగ్ తెష్రింగ్ షెర్పా నేపాల్లో విమానయానంతోపాటు, ఆతిథ్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు. టెర్తుమ్ జిల్లాలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం ఏరియల్ సర్వే కోసం మంత్రి, మరో ముగ్గురు అధికారులతో కలిసి హెలికాఫ్టర్లో బయలుదేరి వెళ్లారు.
కాఠ్మాండూ: నేపాల్ (Nepal)లో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్లైన్స్ (Yeti Airlines)యజమాని ఆంగ్ తెష్రింగ్ షెర్పా సైతం మూడు ఏళ్ల క్రితం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈయన యతి ఎయిర్లైన్స్తోపాటు తారా ఎయిర్లైన్స్, నేపాల్కు చెందిన ఏకైక అంతర్జాతీ విమానయాన సంస్థ హిమాలయన్ ఎయిర్లైన్స్ను నిర్వహించేవారు. 2019 ఫిబ్రవరిలో నేపాల్లోని పతిభర జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆంగ్ తెష్రింగ్ షెర్పా మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు అప్పటి నేపాల్ విమానయానశాఖ మంత్రి రవీంద్ర అధికారి, మరో ముగ్గరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంగ్ తెష్రింగ్ షెర్పా నేపాల్లో విమానయానంతోపాటు, ఆతిథ్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు. టెర్తుమ్ జిల్లాలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం ఏరియల్ సర్వే కోసం అప్పటి విమానయానశాఖ మంత్రి, మరో ముగ్గురు అధికారులతో కలిసి ఎయిర్ డైనెస్టి అనే హెలి సర్వీస్ సంస్థ హెలికాఫ్టర్లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళ్లారు. ఏరియల్ సర్వే అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో పతిభర జిల్లాలోని తాప్లెజంగ్ ప్రాంతంలోని కొండల్లో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్లోని ఆరుగురు చనిపోయారు. అప్పట్లో ఈ వార్త నేపాల్లో సంచలనమైంది. తాజాగా ఆయన సంస్థకు చెందిన విమానం కూలిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థకు ఆయన తమ్ముడు లక్పా సోనమ్ షెర్పా ఛైర్మన్గా వ్యవహరిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.