KTR: అందర్నీ ఆహ్వానించలేకపోతున్నాం.. మన్నించండి: కేటీఆర్
భారత దేశంలో కీలక రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ, తెరాస అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మా అధ్యక్షుడు కేసీఆర్ తెరాస ప్లీనరీలో పార్టీ విధివిదానాలను వివరించనున్నారని తెలిపారు. దేశంలోని దిగువ మధ్యతరగతి ప్రజల గుండెచప్పుడు వినిపించే విధంగా తెరాస విధానాలను రూపొందించాం. 11 తీర్మాణాలు ఆమోదిస్తామన్నారు. పార్టీలో 60 లక్షల మంది సభ్యులున్నప్పటికి అందరిని ఆహ్వానించలేకపోతున్నామని, మన్నించాలని కోరారు.
Published : 26 Apr 2022 15:41 IST
Tags :