AP News: గోదావరి తీరాన వైకాపా ప్రజాప్రతినిధి అక్రమాలు

ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం..

Published : 25 Apr 2024 13:01 IST

ఇసుక అక్రమాల్లో ఆయన ఆరితేరిపోయారు. రూ.కోట్లను  ప్రసాదంలా ఆరగించారు. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం పెట్టి ఘనంగా దోచుకున్నారు. వంతెన మార్గాన్ని మార్చి భూముల పందేరం చేశారు. కొవిడ్ విరాళాల్లోనూ స్వాహాకు తెరతీసిన ఘనాపాటి. సముద్ర తీరం, గోదావరి తీరం కలగలిసిన ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా వెలుగుతున్న తన నియోజకవర్గానికి జిల్లా కేంద్రం అర్హత ఉన్నా ఆ దిశగా ఎలాంటి పోరాటం చేయని నిర్లక్ష్యపు ప్రజాప్రతినిధి. హద్దులేని దందాలకు రారాజు ఆయనే.

Tags :

మరిన్ని