Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్ తమిళిసై
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ అక్కడికి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత వారితో మాట్లాడి ట్రిపుల్ ఐటీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడారు.
Published : 07 Aug 2022 16:18 IST
Tags :