బ్రేకింగ్

breaking
26 Apr 2024 | 17:24 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు కౌంటరు దాఖలు చేశారు. ఇదే కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్‌రావు కూడా నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాధాకిషన్‌రావు పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం ఈనెల 29కి వాయిదా వేసింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని