logo

8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త

కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం సిరుత్తనూర్‌ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్‌ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు.

Updated : 07 May 2024 14:52 IST

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం సిరుత్తనూర్‌ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్‌ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. అదే గ్రామానికి చెందిన రాజ్‌ కుమారుడు తమిళరసన్‌ (28) చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. రోస్లిన్‌ మేరీ, తమిళరసన్‌ 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరుతూరాగా ప్రియుడు తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో తమకు పెళ్లి జరిపించాలని ఉళుందూర్‌పేట పోలీసుస్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇరువురి కుటుంబీకులను స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. అయినా యువకుడు అంగీకరించకపోవడంతో అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. యువతి కుటుంబీకుల ఒత్తిడితో సోమవారం తమిళరసన్‌ ఓ ఆశ్రమంలో రోస్లిన్‌ మేరీకి తాళి కట్టి పారిపోయాడు. దీంతో మళ్లీ యువతి పోలీసులను ఆశ్రయించింది. వారు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని