తాతా.. నువ్వు సూపర్.!
104 ఏళ్ల వయసు.. అయినా బోధనపైౖనే మనసు.. నిత్యం సాయంత్రం ఉచితంగా పాఠాలు.. 75 ఏళ్లుగా ఆ తాతది ఇదే ప్రయాణం.. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!
104 ఏళ్ల వయసు.. అయినా బోధనపైౖనే మనసు.. నిత్యం సాయంత్రం ఉచితంగా పాఠాలు.. 75 ఏళ్లుగా ఆ తాతది ఇదే ప్రయాణం.. ఆ విశేషాలు తెలుసుకుందామా..!!
ఒడిశా రాష్ట్రం జాజ్పుర్ జిల్లా బార్తాండకు చెందిన నంద ప్రాస్తికి 104 ఏళ్లు. అసలు ఒక మనిషి ఇన్నేళ్లు బతకడమే గొప్ప. ఒకవేళ జీవించి ఉన్నా.. మంచానికి పరిమితమవడమో, ఇంట్లోనే ఉండటమో చేస్తారు. కానీ, ఈ తాత మాత్రం అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రతి రోజూ.సాయంత్రం పిల్లలకు చదువు చెబుతున్నాడు. అలా అని డబ్బులు వసూలు చేస్తాడేమో అని అనుకోకండి. ఎవరి దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడు. అక్షర జ్ఞానం లేని పెద్దలు కూడా ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 ఏళ్లుగా ఆయన ఓ పెద్ద చెట్టు కిందే ఉచితంగా పాఠాలు బోధిస్తున్నాడు.
సంతకం నేర్పించాలనుకొని..
తాతకు బోధనంటే ఇష్టం. అందుకే ఇన్నేళ్లుగా విరామం లేకుండా పిల్లలకు, పెద్దలకు పాఠాలు చెబుతున్నాడు. మొదట్లో ఆ తాత వ్యవసాయం చేసుకునేవాడంట. ఊర్లోని వారికి సంతకం చేయడమూ రాకపోవడంతో వేలిముద్రే పెట్టేవారంట. వారికి ఎలాగైనా సంతకం చేయడం నేర్పించాలని అనుకున్నాడు. వారంతా ఆసక్తి చూపడంతో ప్రతి రోజూ సాయంత్రం బడి నిర్వహించేవాడు. అంతేకాదండోయ్.. తన మొదటి బ్యాచ్ విద్యార్థుల పిల్లలు కూడా ఇప్పుడు తాత దగ్గరే చదువుతున్నారంట.
ప్రభుత్వ సాయం వద్దని..
ఎప్పటి నుంచో చెట్టు కిందే తరగతులు కొనసాగిస్తుండటంతో.. ఆయన కష్టాన్ని చూసిన అక్కడి నాయకులు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పారట. అయినా ఆ పెద్దాయన దాన్ని తిరస్కరించాడంట. నాలుగు గోడల మధ్య కాకుండా బయటే పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు. ఎంత మంచి తాతో కదా..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434