తొలిరోజునే సాగు చట్టాల రద్దు బిల్లు
వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం సోమవారమే బిల్లు ప్రవేశపెట్టనుంది. అదే రోజున పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అజెండాలోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు చోటు దక్కింది.
రేపు ప్రవేశపెట్టనున్న కేంద్ర వ్యవసాయ మంత్రి
మద్దతుధరపై అధ్యయనానికి కమిటీ
దిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వం సోమవారమే బిల్లు ప్రవేశపెట్టనుంది. అదే రోజున పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అజెండాలోనే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు చోటు దక్కింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభం రోజున తప్పకుండా హాజరు కావాలంటూ భాజపా, కాంగ్రెస్లు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. కనీస మద్దతు ధర అమలుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
బిల్లు లక్ష్యాలపై కాంగ్రెస్ అభ్యంతరం
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ‘లక్ష్యాలు-కారణాల’పై కాంగ్రెస్ విమర్శించింది. చట్టాలకు వ్యతిరేకంగా చాలా తక్కువ మంది రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ, సమ్మిళిత అభివృద్ధి సాధనకు అందర్నీ కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో వాటిని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకు కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అభ్యంతరం తెలిపారు. ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు ప్రాణ త్యాగం చేస్తే దానిని గుర్తించకుండా, కేవలం కొంతమంది రైతులే వ్యతిరేకిస్తున్నారని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
ట్రాక్టర్ల ప్రదర్శన రద్దు
సోమవారం పార్లమెంటు వరకు ట్రాక్టర్ల ప్రదర్శన జరపాలన్న నిర్ణయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా రద్దు చేసుకుంది. డిసెంబరు నాలుగో తేదీన జరగనున్న భేటీలో తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నాయకుడు ధర్మేంద్ర మాలిక్ ‘ఈటీవీ భారత్’కు చెప్పారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించడంతో పాటు, మరో అయిదు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానికి రాసిన లేఖపై సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మరో రైతు నాయకుడు రాజ్వీర్ జదౌన్ మాట్లాడుతూ ప్రభుత్వం మీడియాతో మాట్లాడే బదులు రైతు సంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించాలని అన్నారు. ఆదివారం ముంబయిలో దాదాపు 100 రైతు సంఘాలు కలిసి కిసాన్-మజ్దూర్ మహాపంచాయత్ను నిర్వహించనున్నాయి.
రైతులు ఇళ్లకు వెళ్లాలి : తోమర్
కనీస మద్దతు ధరల అమలుపై అధ్యయానికి ప్రధాని కమిటీని నియమించారని మంత్రి తోమర్ చెప్పారు. ఈ కమిటీలో రైతు ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ అంశంపై డిమాండు నెరవేరినందున ఆందోళనను విరమించి ఇళ్లకు వెళ్లాలని రైతుల్ని కోరారు. పంట వ్యర్థాలను దహనం చేయడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించకూడదని రైతులు కోరారని, అందుకు కూడా ప్రభుత్వం సమ్మతించిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM