కళ్లాల నిండా కన్నీళ్లే!
పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా..
చేతికొచ్చిన పంటపై వరుణుడి పంజా
2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు
ఈనాడు, అమరావతి: పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా.. అదీ కాస్త కళ్లాల్లోనే తడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల వరి పనలు నీటిలో తేలుతున్నాయి. కొన్నిచోట్ల కుప్పలేసిన మినుము, ధాన్యం తడిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో సెనగకు కొంతమేర మేలైనా.. వర్షం ఎక్కువైతే అదీ దెబ్బతింటుంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారి, విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి జల్లులతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. విజయవాడలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జల్లులు పడ్డాయి. గాలులకు వరి నేలకొరుగుతుంటే.. వర్షాలకు కోసిన పనలు, ధాన్యం తడుస్తోంది. ధాన్యం కాపాడుకునేందుకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు వెచ్చించి రైతులు టార్పాలిన్లు కొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.
వర్షపాతం ఇలా..
వర్షానికి గుంటూరు జిల్లాల్లో దాదాపు అన్ని మండలాలు ప్రభావితమయ్యాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 86.5 మి.మీ వర్షం పడింది. ఆ తర్వాత పార్వతీపురం 83.0 మి.మీ, గొలుగొండ 63.5, గుంటూరు జిల్లా పొన్నూరులో 60.0, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో 54.0, కృష్ణా జిల్లా గూడూరులో 49.5, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 43.75 మి.మీ వాన కురిసింది.
*బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల మధ్య నెల్లూరు జిల్లా చిల్లకూరులో 65.5మి.మీ, అనంతసాగరం మండలం రేవూరులో 47.5, కర్నూలు జిల్లా పగిడ్యాలలో 46.0, కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో 41.0, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల జల్లులు పడ్డాయి.
నేడు, రేపు వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.
నీటమునిగిన ధాన్యం రాశులు
చీరాల గ్రామీణం, వేటపాలెం, న్యూస్టుడే : ప్రకాశం జిల్లాలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, వరి పనలు తడిసి పోయాయి. చీరాల ప్రాంతాల్లోని తోటవారిపాలెం ఎత్తిపోతల కింద 500 ఎకరాల్లోని కోతకొచ్చిన వరి నీట మునిగింది. వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, దేశాయిపేట గ్రామాల్లో 320 ఎకరాల్లో కోసిన వరి పనలు, 45 ఎకరాల్లోని ధాన్యం దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. రాజుబంగారుపాలెం, పెదగంజాం పంచాయతీ పరిధిలోని 40 ఎకరాల్లోని వరి కోసి కుప్ప చేయగా మొత్తం నీట మునిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!