కళ్లాల నిండా కన్నీళ్లే!
పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా..
చేతికొచ్చిన పంటపై వరుణుడి పంజా
2 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు
ఈనాడు, అమరావతి: పంట ఇంటికి చేరే సమయంలో వరుణుడు మళ్లీ పంజా విసిరాడు. కళ్లాల్లో మిరప, ధాన్యం తడిసిపోతోంది. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతినగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిరప.. ఈ సారి తక్కువ దిగుబడి రాగా.. అదీ కాస్త కళ్లాల్లోనే తడుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల వరి పనలు నీటిలో తేలుతున్నాయి. కొన్నిచోట్ల కుప్పలేసిన మినుము, ధాన్యం తడిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో సెనగకు కొంతమేర మేలైనా.. వర్షం ఎక్కువైతే అదీ దెబ్బతింటుంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారి, విస్తారంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి జల్లులతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. విజయవాడలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా జల్లులు పడ్డాయి. గాలులకు వరి నేలకొరుగుతుంటే.. వర్షాలకు కోసిన పనలు, ధాన్యం తడుస్తోంది. ధాన్యం కాపాడుకునేందుకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు వెచ్చించి రైతులు టార్పాలిన్లు కొంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.
వర్షపాతం ఇలా..
వర్షానికి గుంటూరు జిల్లాల్లో దాదాపు అన్ని మండలాలు ప్రభావితమయ్యాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 86.5 మి.మీ వర్షం పడింది. ఆ తర్వాత పార్వతీపురం 83.0 మి.మీ, గొలుగొండ 63.5, గుంటూరు జిల్లా పొన్నూరులో 60.0, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో 54.0, కృష్ణా జిల్లా గూడూరులో 49.5, నెల్లూరు జిల్లా వెంకటగిరిలో 43.75 మి.మీ వాన కురిసింది.
*బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల మధ్య నెల్లూరు జిల్లా చిల్లకూరులో 65.5మి.మీ, అనంతసాగరం మండలం రేవూరులో 47.5, కర్నూలు జిల్లా పగిడ్యాలలో 46.0, కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో 41.0, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 40.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల జల్లులు పడ్డాయి.
నేడు, రేపు వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.
నీటమునిగిన ధాన్యం రాశులు
చీరాల గ్రామీణం, వేటపాలెం, న్యూస్టుడే : ప్రకాశం జిల్లాలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, వరి పనలు తడిసి పోయాయి. చీరాల ప్రాంతాల్లోని తోటవారిపాలెం ఎత్తిపోతల కింద 500 ఎకరాల్లోని కోతకొచ్చిన వరి నీట మునిగింది. వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, దేశాయిపేట గ్రామాల్లో 320 ఎకరాల్లో కోసిన వరి పనలు, 45 ఎకరాల్లోని ధాన్యం దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. రాజుబంగారుపాలెం, పెదగంజాం పంచాయతీ పరిధిలోని 40 ఎకరాల్లోని వరి కోసి కుప్ప చేయగా మొత్తం నీట మునిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... తోఫాకో దోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. -
సంక్షిప్తవార్తలు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. -
ఓటు ప్రాధాన్యంపై నేడు రౌండ్టేబుల్ సమావేశం
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ అంశంపై విజయవాడలో గురువారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
పింఛనుదారులకు పూర్వ వైభవం రావాలి
ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు విచక్షణతో వ్యవహరించి ఎన్నికల్లో కుటుంబసభ్యులతో సహా విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని హైదరాబాద్లో స్థిరపడిన ప్రభుత్వ పింఛనుదారుల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎన్బీ బుచ్చిరాజు బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. -
వారికి లేని బాధ మీకెందుకు?
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్