అక్రమ లేఅవుట్లకు రాజకీయ అండ!
రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్దఎత్తున వెలుస్తున్నాయి.రాజకీయ నేతల అండ, అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటితో పంచాయతీలు, సమీప పట్టణాభివృద్ధి సంస్థలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
రాష్ట్రంలో అనుమతులు లేని వెంచర్లు 13,711
చర్యలపై పంచాయతీ అధికారుల ప్రేక్షక పాత్ర
స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి
విజయవాడ నగర శివారులో 12 ఎకరాల్లో ఒకరు అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ వేశారు. రోడ్లు చదును చేస్తుండగా పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యంతో మిన్నకుండిపోయారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో స్థిరాస్తి వ్యాపారి ఒకరు 15 ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించారు. అనుమతులన్నీ ఉన్నట్లు బోగస్ పత్రాలు సృష్టించారు. అక్రమ లేఅవుట్ అని తెలిసి నిర్మాణాలకు బ్యాంకు రుణాలు రాక కొన్నవారు వాపోతున్నారు.
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్దఎత్తున వెలుస్తున్నాయి.రాజకీయ నేతల అండ, అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీటితో పంచాయతీలు, సమీప పట్టణాభివృద్ధి సంస్థలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొని పలువురు ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని పంచాయతీల పరిధిలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 13,711 అనధికార లేఅవుట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,792 లేఅవుట్లు గుర్తించారు. అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అధికంగా బయటపడ్డాయి.
నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయి?
అక్రమ లేఅవుట్లను మొదట్లోనే గుర్తించి నిరోధించేందుకు ఏర్పాటుచేసిన నిఘా కమిటీల పనితీరు అంతంతమాత్రంగా ఉంటోంది. డివిజినల్ పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) ఆధ్వర్యంలో నిఘా కమిటీలు అనుమతుల్లేని లేఅవుట్లను గుర్తించి బాధ్యులకు నోటీసులివ్వాలి. అనంతపురం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం,ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వెలసిన కొన్ని అక్రమ లేఅవుట్లపై నిఘా కమిటీలకు సమాచారం వెళ్లినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న
ఆరోపణలున్నాయి.
అక్రమ లేఅవుట్లతో ప్రాథమిక దశలో గ్రామ పంచాయతీలు, తరువాత దశలో పట్టణాభివృద్ధి సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. పదెకరాల లేఅవుట్పై గ్రామ పంచాయతీ వివిధ రుసుముల కింద రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థలు మరో రూ.5 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. లేఅవుట్లో సామాజిక అవసరాల కోసం పది శాతం ఖాళీ స్థలాన్నీ వదలకుండా అమ్మేస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో కొన్న ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు రావు. పట్టణాభివృద్ధి సంస్థలు లేఅవుట్ ప్లాను (ఎల్పీ) నంబరు కేటాయించని కారణంగా బ్యాంకులు రుణాలివ్వడం లేదు. దీంతో కొన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు కోకొల్లలుగా వస్తున్నాయి.
అక్రమ లేఅవుట్లపై చర్యలకు సిఫార్సు
‘అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్లలో 90% వరకు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నాయి. వీటిపై తదుపరి చర్యల కోసం పురపాలక శాఖలోని పట్టణ ప్రణాళిక విభాగానికి నివేదించాం. అక్రమ లేఅవుట్ల నిరోధానికి ఏర్పాటుచేసిన నిఘా కమిటీల పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’.
-కోన శశిధర్, కమిషనర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే