Andhra News: అన్న వస్తున్నాడు.. మీ కార్లు జాగ్రత్త: జనసేన వినూత్న నిరసన

తిరుపతికి జగనన్న వస్తున్నాడు.. మీ కార్లు జాగ్రత్తగా పెట్టుకోండి.. అంటూ జనసేన నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతిలోని బైరాగిపట్టెడవద్ద ఆదివారం జనసేన నాయకులు కార్లకు గొలుసులు కట్టి తాళాలు వేశారు. అన్న వస్తున్నాడు..

Updated : 02 May 2022 09:16 IST

తిరుపతి (తాతయ్యగుంట), న్యూస్‌టుడే: తిరుపతికి జగనన్న వస్తున్నాడు.. మీ కార్లు జాగ్రత్తగా పెట్టుకోండి.. అంటూ జనసేన నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతిలోని బైరాగిపట్టెడవద్ద ఆదివారం జనసేన నాయకులు కార్లకు గొలుసులు కట్టి తాళాలు వేశారు. అన్న వస్తున్నాడు.. మీ కార్లు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ దండోరా వేశారు. ఈ సందర్భంగా పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి పర్యటనకు రానున్నందున అధికారులు వాహనశ్రేణి కోసం వెతుకులాట ప్రారంభించారని తెలిపారు. రవాణాశాఖ బకాయిలు చెల్లించకపోవడంతో ట్రావెల్స్‌ నిర్వాహకులు వాహనాలను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలు తమ కార్లు, వాహనాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే యాత్రికులు కార్లలో కాకుండా బస్సులు, రైళ్లు, విమానాల్లో వస్తే మంచిదని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని