మీ సాయం శక్తినిచ్చింది
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తనకు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రభుత్వంనుంచి సాయం అందిస్తామని
ఏపీ సీఎం జగన్కు నటుడు కైకాల లేఖ
ఈనాడు, హైదరాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తనకు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. వ్యక్తిగతంగా ఫోన్ చేసి ప్రభుత్వంనుంచి సాయం అందిస్తామని హామీనివ్వడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. నవంబరులో కైకాల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘మీరు హామీ ఇచ్చినట్టుగానే ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థికసాయం సహా అన్ని విధాలా ఆదుకున్నారు. ఆ కష్ట సమయంలో మీ సాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింద’ని లేఖలో వివరించారు. అభిమానుల ప్రార్థనలే తనను మళ్లీ మామూలు మనిషిని చేశాయని, తనకు బాగోలేనప్పుడు కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434