AP News: జేసీలను కలవండి
థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జిల్లాల సంయుక్త కలెక్టర్లకు విన్నవిస్తే వారు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో
లోపాల దిద్దుబాటుపై హామీ ఇవ్వండి
పరిశీలించే అధికారం వారిదే..
థియేటర్ల యజమానులతో మంత్రి పేర్ని నాని
ఈనాడు- అమరావతి, మచిలీపట్నం కార్పొరేషన్- న్యూస్టుడే: థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని జిల్లాల సంయుక్త కలెక్టర్లకు విన్నవిస్తే వారు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిని సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి గురువారం కలిశారు. ఈ సందర్భంగా అక్కడున్న సినీ పరిశ్రమ వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు. సీజ్ చేసిన థియేటర్లకు సంబంధించిన అనుమతుల పునరుద్ధరణ, ఇతర లోపాలను నెలలోగా సరిదిద్దుకుంటామని యజమానులు హామీ ఇస్తే పరిశీలించే అధికారం జేసీలకు ఉందని స్పష్టం చేశారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. ‘చట్ట ప్రకారం థియేటర్ల తనిఖీ, సంజాయిషీ నోటీసుల జారీ, సీజ్ చేసే అధికారం జేసీలకు ఉంది. బీఫాం అనుమతులు పునరుద్ధరించుకోకుండా.. అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం లేకుండా థియేటర్లను నడపడం దుర్మార్గం. నిబంధనల ప్రకారం అనుమతులు పునరుద్ధరించుకోవాలని సెప్టెంబరులోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా డిసెంబరు వరకు స్పందించకుండా థియేటర్లను నడిపితే ఎలా? వాటి తనిఖీ సమయంలో గుర్తించిన లోపాల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? దీనికి భిన్నంగా కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నామని ఎలా చెబుతారు? అనుమతుల్లేని థియేటర్లను నడిపించడం ధర్మమా? కొందరు ప్రభుత్వం గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. జిల్లాల్లో అధికారులను కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని నన్ను కలిసిన పలువురు కృష్ణా జిల్లా థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లకు స్పష్టంగా చెప్పా’ అని తెలిపారు.
పంతాలను సినీ పరిశ్రమకు ముడిపెట్టొద్దు: నారాయణమూర్తి
‘సినీ పరిశ్రమకు పంతాలను ముడిపెట్టొద్దు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకుంటారని ఆశిస్తున్నా. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు ఎంతైనా పెంచుకోవచ్చనే డిమాండును ఖండిస్తున్నా. సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో సినిమా తీసేవాళ్లు, చూపించేవాళ్లు, చూసేవాళ్లందరికీ మంచి అనిపించే నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, ఫిలిం ఛాంబర్, సినిమా పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ను కలిసే అవకాశం కల్పించి అందరి అభిప్రాయాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పేర్నిని కోరా. ఎవరైనా సరే వ్యక్తిగత ఇష్టాఇష్టాలను పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదు’ అని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM