
Hijab: హిజాబ్ సమస్యను దేశవ్యాప్తం చేయొద్దు
ప్రతిపౌరుడి రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షిస్తాం
కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తగిన సమయంలోనే విచారణ
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టీకరణ
దిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ సంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులు విద్యాసంస్థలకు రావద్దన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుముచిత సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని దేశవ్యాప్త సమస్యగా చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరమైనవిగా భావించి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘హైకోర్టు ఈ అంశంపై అత్యవసర విచారణను జరుపుతోంది. అక్కడ వెలువడిన ఉత్తర్వు ఏమిటో ఇంకా తెలియలేదు. కొంత సమయం వేచిచూద్దాం’ అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ...‘కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు వల్ల రాజ్యాంగ అధికరణం 25 ద్వారా పౌరులకు సమకూరిన మత విశ్వాసాల ఆచరణ హక్కుకు భంగం కలుగుతుంది. ఈ ఉత్తర్వు ముస్లింలపైనే కాకుండా ఇతర మతాల వారిపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక సత్వరమే విచారణ జరపండి’ అని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇంకా అందుబాటు రాలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించినా అందరికీ ఆమోదయోగ్యమేనని సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ పేర్కొనగా.. ‘కర్ణాటకతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో మేం గమనిస్తున్నాం. వస్త్రధారణ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చి దిల్లీకి తీసుకురావడం భావ్యమేనా మీరు కూడా ఆలోచించండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని న్యాయవాది అభిప్రాయపడగా...‘ఏదైనా తప్పు జరిగితే ధర్మాసనం తప్పనిసరిగా ఆ విషయాన్ని పరిశీలిస్తుంది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని సీజేఐ విస్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Priyanka Chaturvedi: రాజకీయ సంక్షోభంపై బెదిరింపు కాల్స్.. పోలీసులను ఆశ్రయించిన శివసేన ఎంపీ
-
General News
Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
-
Politics News
Maharashtra Crisis: ఏక్నాథ్ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే
-
Politics News
Janasena: దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కల్పించాలి: నాగబాబు
-
General News
Health: పిల్లలకు అవసరమైతేనే శస్త్రచికిత్స
-
Business News
IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- Super Tax: పాక్లో ‘సూపర్’ పన్ను!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి