Andhra News: ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.6,72,214 కోట్లు
ఆంధ్రప్రదేశ్ గత రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రుణాంధ్రప్రదేశ్గా మారిపోయిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. 2019 మేలో సీఎంగా చంద్రబాబు దిగి పోయే నాటికి అప్పు రూ.2,02,543 కోట్లని ప్రస్తుత ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేయడంతో 2021 డిసెంబర్ నాటికి
చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,02,543 కోట్లు
రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అప్పులపాలు చేసింది
మొత్తం వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి
రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ గత రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రుణాంధ్రప్రదేశ్గా మారిపోయిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. 2019 మేలో సీఎంగా చంద్రబాబు దిగి పోయే నాటికి అప్పు రూ.2,02,543 కోట్లని ప్రస్తుత ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేయడంతో 2021 డిసెంబర్ నాటికి అది రూ.6,72,214 కోట్లకు చేరిందని తెలిపారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఎనిమిది ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతో ఆమోదించిన విభజన చట్టం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తోంది. రాజకీయాలను పక్కనపెట్టి మా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా డిమాండ్ను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి. రాజధాని అమరావతిని కాపాడి, దానికి మద్దతు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి అనిశ్చితి నెలకొల్పింది. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించాలి. ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే 8 ఏళ్లు గడిచిపోయింది.
రాష్ట్రంలో అపసవ్య పాలన
ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని వ్యవహారాలూ బడ్జెట్లో పొందుపరిచిన విధానాలకు విరుద్ధంగా సాగుతున్నాయి. 2019 మే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,02,543 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన గ్యారెంటీలు రూ.1,53,134 కోట్లు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.79వేల కోట్లు. డిస్కంల బకాయిలు రూ.29వేల కోట్లు. ఇవన్నీ కలిపితే ప్రస్తుత అప్పు రూ.6,72,214 కోట్లకు చేరింది. 2018-19లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.44,234 కోట్లు రాగా 2021-22నాటికి అది రెట్టింపై రూ.86,866కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులు వస్తున్నా రాష్ట్రం విచక్షణారహితంగా అప్పులు చేస్తోంది. కాగ్ అంచనాల ప్రకారం 2019-20లో రెవెన్యూ లోటు అంచనాలకు మించి.1486 శాతం పెరిగినట్లు కాగ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే రెవెన్యూలోటు రూ.40,829 కోట్లకు చేరింది. రెవెన్యూలోటు రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేయగా అది 816% పెరిగినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ నిబంధనలను ఉల్లంఘించి రూ.41,043 కోట్లు ఉపసంహరించుకోవడం పట్ల ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ 2021 మే 4న రాసిన లేఖలో అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర రుణ సేకరణ కూడా బడ్జెట్ అంచనాలను మించిపోయినట్లు కాగ్ హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం గ్యారెంటీల నిష్పత్తిని 90% నుంచి 180%కి పెంచుతూ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ఇటీవల విజయవాడకు వెళ్లినప్పుడు వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టి రూ.25వేల కోట్ల రుణాలు సేకరించారు. 2021-22లో రాష్ట్ర రుణ సేకరణ పరిమితిని రూ.42,474 కోట్లకు పెంచాలని సీఎం జనవరి 3న ప్రధానికి లేఖ కూడా రాశారు. యేటా రాష్ట్ర ప్రభుత్వం రూ.80వేల కోట్ల మేర అప్పులు చేస్తోంది. ఇది అనుమతిచ్చిన దానికంటే రెట్టింపు. నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి’ అని కనకమేడల డిమాండ్ చేశారు.
మోదీతో పోట్లాడే ధైర్యం లేదా..?
‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. దానిపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదు. న్యాయం చేయమని ప్రధానమంత్రి మోదీతో పొట్లాడే ధైర్యం ముఖ్యమంత్రికి, వైకాపాకు లేదా’ అని కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధానిని వైకాపా ప్రశ్నించలేకపోవడానికి కారణం వారి అసమర్థతా? లేక కేసుల భయమా? ప్రత్యేక హోదా కోసం ప్రధాని మెడలు వంచుతారా లేక కాలయాపన చేస్తారా? తేల్చుకోండి. కేంద్రంపై వైకాపా ఎంపీలు పోరాడితే మేము వారి వెంట ఉంటాం’ అని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు