నీరు లేకున్నా పండే వరి!
వరి సాగు అనగానే నిండా నీళ్లున్న పొలాలే మదిలో మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ప్రధాన ఆహారమైన ఈ పంటకు భారీగా జలం వినియోగమవుతోంది. వర్షాభావ, కరవు పరిస్థితులు ఉన్నప్పుడు వరి సాగు కష్టమవుతోంది.
కరవును తట్టుకునే జన్యువు
గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు
ఈనాడు, ప్రత్యేక విభాగం: వరి సాగు అనగానే నిండా నీళ్లున్న పొలాలే మదిలో మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ప్రధాన ఆహారమైన ఈ పంటకు భారీగా జలం వినియోగమవుతోంది. వర్షాభావ, కరవు పరిస్థితులు ఉన్నప్పుడు వరి సాగు కష్టమవుతోంది. దీన్ని అధిగమించే ఒక జన్యువును చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీటి కొరత ఉన్నా.. మంచి దిగుబడులు సాధించేందుకు ఇది వీలు కల్పిస్తుందని వారు చెబుతున్నారు.
ఎందుకు?: ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆహార ధాన్యాల్లో వరి ఒకటి. గోధుమ, మొక్కజొన్న వంటి పంటలతో పోలిస్తే నీటి కొరత ప్రభావం దీనిపై ఎక్కువ. సంప్రదాయసిద్ధంగా భారీగా నీటిని ఉపయోగించి ఈ పంటను సాగు చేయడమే ఇందుకు కారణం. కిలో వరి ధాన్యాన్ని పండించడానికి 4,500-5,000 లీటర్ల నీరు అవసరమని అంచనా. నిజానికి ఇది నీటిలో పెరిగే మొక్క కాదు. అయితే నీట మునిగినా తట్టుకునే లక్షణం దీని సొంతం. వరి పంటలో కలుపు మొక్కల బెడదను తగ్గించడానికి రైతులు ఈ గుణాన్ని ఉపయోగించుకుంటున్నారు. వరి పొలాన్ని భారీగా నీటితో ముంచెత్తుతూ.. నేలకు సూర్యకాంతి, గాలి అందని పరిస్థితి కల్పిస్తున్నారు. దీనివల్ల కలుపు మొక్కలు పెరగడం కష్టమవుతోంది.
అయితే అంతిమంగా.. వరిసాగు చేయాలంటే భారీ నీటి వినియోగం అవసరంగా మారిపోయింది. కొన్నిచోట్ల నీటి యాజమాన్య పద్ధతులు సరిగా లేక వృథా ఎక్కువగా జరుగుతోంది. సరైన విధానాలు అవలంబిస్తే కిలో వరి సాగుకు 600 లీటర్ల నీరు చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భారత్లో సరాసరిన 15వేల లీటర్ల మేర వాడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడిని తట్టుకునే వరి వంగడాలను అభివృద్ధి చేయాల్సిన తక్షణావసరం ఏర్పడింది.
ఈ జన్యువే కీలకం: చైనాలోని షాంఘై ఆగ్రోబయలాజికల్ జీన్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై దృష్టి పెట్టారు. కరవు పరిస్థితుల్లో సాగు చేసిన వరిని.. సాధారణ పరిస్థితుల్లో పెరిగిన మొక్కలతో పోల్చి చూశారు. తద్వారా నీటి కొరతను అధిగమించడంలో సాయపడే ఓఎస్ఆర్ఐఎన్జీజడ్ఎఫ్1 జన్యువును కనుగొన్నారు. క్రోమోజోమ్4ను నిశితంగా మ్యాప్ చేయడం ద్వారా దీని జాడను పసిగట్టారు. ఈ జన్యువు వరి మొక్కల్లోని కణాల్లో నీటి ప్రవాహ మార్గాలను తగ్గిస్తుంది. తద్వారా కరవు పరిస్థితుల్లో నీటిని పరిరక్షించుకునే సామర్థ్యాన్ని మొక్కలో పెంచుతుంది.
* ఈ జన్యువు క్రియాశీలత అధికంగా ఉంటే.. కరవు, లవణీయత వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వరి మొక్కకు సమకూరుతుంది. అది లోపిస్తే నీటి ఎద్దడి తాకిడికి ఎక్కువగా లోనవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
* ఈ జన్యువు క్రియాశీలత అధికంగా ఉన్న వరి వంగడం.. కరవు పరిస్థితుల్లో సాధారణ వరి కన్నా 10 శాతం అధికంగా దిగుబడినిస్తుందని తేల్చారు.
* ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరే ప్రధాన ఆహారం.
* వందకుపైగా దేశాల్లోని 6.4 కోట్ల హెక్టార్లలో ఈ పంటను పండిస్తున్నారు.
* ఏటా 70 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతోంది.
* ప్రపంచ వరి ఉత్పత్తిలో ఆసియా వాటా 90 శాతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!