నేను సమావేశం ఏర్పాటు చేస్తే రారా?

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన వైకాపా నియోజకవర్గస్థాయి సమావేశానికి 50 డివిజన్లకు ఏకంగా 24 డివిజన్ల పార్టీ ఇన్‌ఛార్జులు గైర్హాజరవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో

Published : 24 Jun 2022 05:17 IST

పార్టీ నేతలపై మంత్రి ధర్మాన ఆగ్రహం

అరసవల్లి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన వైకాపా నియోజకవర్గస్థాయి సమావేశానికి 50 డివిజన్లకు ఏకంగా 24 డివిజన్ల పార్టీ ఇన్‌ఛార్జులు గైర్హాజరవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల తర్వాత జిల్లాకు రానున్నారు. దీనిపై స్వయంగా నేను సమావేశం ఏర్పాటు చేస్తే డివిజన్‌ ఇన్‌ఛార్జులు రారా...? హాజరు కానివారందర్నీ ఈ రాత్రికే తొలగించి, కొత్త వారిని నియమించండి. ముఖ్యమంత్రి నా కదలికలపైనా దృష్టి పెట్టారు. గడపగడపకు వెళ్తున్నారా? కార్యకర్తలు హాజరవుతున్నారా? లేదా? అనేది తెలుసుకుంటున్నారు. ఇంతమంది రాకుంటే క్షేత్రస్థాయి సమాచారం ఎలా తెలుస్తుంది? రాలేని వారు అవసరం లేదు’ అంటూ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని